కంపెనీలపై జనతా గ్యారేజ్ ఎఫెక్ట్!

  • August 25, 2016 / 10:09 AM IST

యంగ్ టైగర్ ఎన్టీఆర్, కొరటాల శివ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న “జనతా గ్యారేజ్” పై భారీ క్రేజ్ ఏర్పడింది. సమంత, నిత్యామీనన్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమా సెప్టెంబర్ 1 న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. తొలిరోజు సినిమాను చూడాలని తారక్ అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఆ రోజు ఉద్యోగులు ఆరోగ్యం బాగా లేదని ఎక్కువమంది సెలవు పెట్టి, స్విచ్ ఆఫ్ చేసి సినిమాకు వెళ్తారని తెలిసి కొన్ని కంపెనీ వాళ్లు సెలవు ప్రకటించేస్తున్నారు.

జపాన్ లోని “ఓట్సుకా” అనే ప్రముఖ కంపెనీ తమ ఉద్యోగులకు సెలవుతో పాటు “జనతా గ్యారేజ్” టికెట్లు కూడా అందించడానికి సిద్ధమైంది. అలాగే స్వదేశానికి చెందిన “సన్డే కార్ట్” సంస్థ వాళ్లు కూడా సెప్టెంబర్ 1 న సెలవు ప్రకటించాయి. అంతేకాదు భాగ్యనగరంలోని కొన్ని బడా సంస్థలు “జనతా గ్యారేజ్” రిలీజ్ రోజు హాలిడే ఇవ్వడానికి ఆలోచనలో ఉన్నట్లు తెలిసింది.

మైత్రి మూవీ మేకర్స్ వారు 50 కోట్లతో నిర్మించిన ఈ సినిమాకు రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ ఇచ్చిన సంగీతం జయహో అంటూ అభినందనలు అందుకుంటోంది. మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ కీలక పాత్ర పోషించిన ఈ మూవీ లో కాజల్ పక్క లోకల్ అంటూ అందాలు ఆరబోయనుంది. అనేక ప్రత్యేకతలతో రూపుదిద్దుకున్న ఈ సినిమా కలక్షన్ల రికార్డులను తిరగరాయనుంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus