జై బాలయ్య.. అంటూ అరిచిన ఎన్టీఆర్..!

  • December 31, 2018 / 06:26 AM IST

యంగ్ టైగర్ ఎన్టీఆర్ కి తన బాబాయ్ అయిన నందమూరి బాలకృష్ణకు మధ్య కొత్త కాలం గ్యాప్ ఏర్పడిందనే సంగతి తెలిసిందే. అయితే జూ.ఎన్టీఆర్ తండ్రి నందమూరి హరికృష్ణ మరణం తరువాత బాలకృష్ణ.. జూ.ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ లకు దగ్గరయిన సంగతి కూడా తెలిసిందే. ఈ మధ్య బాలకృష్ణ , ఎన్టీఆర్ ల మధ్య సాన్నిహిత్యం బాగా పెరిగిందనే చెప్పాలి. దానికి నిదర్శనంగా.. జూ.ఎన్టీఆర్ – త్రివిక్రమ్ కాంబినేషన్లో వచ్చిన ‘అరవింద సమేత’ విజయోత్సవ సభకు బాలయ్య ముఖ్య అతిధిగా విచ్చేయగా… ‘ఎన్టీఆర్ బయోపిక్’ ఆడియో వేడుకకు జూ.ఎన్టీఆర్ గెస్ట్ గా హాజరయ్యి వారిమధ్య ఎటువంటి విభేదాలు లేవని ప్రూవ్ చేసారు.

ఇదిలా ఉండగా దర్శకధీరుడు రాజమౌళి తనయుడు ఎస్.ఎస్.కార్తికేయ, విలక్షణ నటుడు జగపతి బాబు సహోదరుడి కుమార్తె పూజా ప్రసాద్ ల వివాహం జైపూర్ లో ఘనంగా జరిగింది. ఈ వేడుకకు టాలీవుడ్ హీరోలు జూ. ఎన్టీఆర్, ప్రభాస్ ,రాంచరణ్,నాని,రానా, అఖిల్ వంటి హీరోలు హాజరయ్యారు.ఇక ఈ పెళ్ళి వేడుకలో భాగంగా జరిగిన పార్టీ లో జూ.ఎన్టీఆర్… ‘జై బాలయ్య.. జై బాలయ్య, జై బాలయ్య అంటూ అరవడం హాట్ టాపిక్ గా మారింది. రాజమౌళి కొడుకు కార్తికేయ పెళ్ళి వేడుక ఆదివారం రాత్రి ఘనంగా జరుగగా.. ముందు రోజు ఏర్పాటు చేసిన సంగీత్ కార్యక్రమంలో ముందుగా ఒక వ్యక్తి .. ‘జై బాలయ్య అంటూ అరిచాడు…. దీంతో మిగతా వారు కూడా జై జై బాలయ్య అంటూ అరిచారు, పక్కనే ఉన్న జూ.ఎన్టీఆర్ కూడా జై బాలయ్య అంటూ ఓ రేంజ్ లో అరిచాడు. దీంతో అక్కడి వాతావరణం మొత్తం సందడిగా మారింది. ఇప్పుడు దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus