బాలీవుడ్ లో కూడా అదరగొడుతున్న ‘అర్జున్ రెడ్డి’..!

  • June 24, 2019 / 06:26 PM IST

‘అర్జున్ రెడ్డి’ చిత్రాన్ని బాలీవుడ్ లో ‘ కభీర్ సింగ్’ పేరుతో రీమేక్ చేసిన సంగతి తెలిసిందే. షాహిద్ కపూర్, కియారా అద్వానీ హీరో హీరోయిన్లుగా రూపొందిన ఈ చిత్రం గత శుక్రవారం.. జూన్ 21 న విడుదలయ్యింది. అయితే ఈ చిత్రం పై కొంతమంది విరుచుకుపడ్డారు. హీరో ఆటిట్యూడ్ మరీ ఘోరంగా ఉందని, అలాగే తెలుగు ప్రేక్షకులకి టేస్ట్ లేదని.. రక రకాల కామెంట్స్ చేసి నెగిటివ్ రివ్యూలు రాసారు. కానీ ప్రేక్షకులను మాత్రం ‘ కభీర్ సింగ్’ ఆకట్టుకుంటున్నాడు. ఫస్ట్ వీకెండ్ ఈ చిత్రానికి ఓపెనింగ్స్ అదిరిపోయాయి.

మొదటి మూడు రోజుల్లోనే ఈ చిత్రం 70 కోట్ల పైనే వసూళ్ళు వచ్చాయని ట్రేడ్ వర్గాలు చెప్పుకొస్తున్నాయి. ఈ విషయం పై తాజాగా తరణ్ ఆదర్శ్ కూడా ట్వీట్ చేశాడు. సెలవు రోజులు కానప్పటికీ.. ‘ కభీర్ సింగ్’ మంచి వసూళ్ళు నమోదు చేసిందని పేర్కొన్నాడు. మొదటి రోజు ఈ చిత్రానికి 20 కోట్లు, రెండో రోజు 22 కోట్లు, మూడో రోజు 28 కోట్లు వచ్చాయట. ఏదేమైనా నెగిటివ్ రివ్యూలు వచ్చినప్పటికీ ‘అర్జున్ రెడ్డి’ (‘కబీర్ సింగ్’) బాలీవుడ్ లో కూడా దుమ్మురేపుతుండడం విశేషం.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus