‘భోళా శంకర్’ వంటి డిజాస్టర్ తర్వాత మెగాస్టార్ చిరంజీవి ‘విశ్వంభర'(Vishwambhara) అనే సినిమా చేశారు. 2025 జనవరి 10న ఈ సినిమా రిలీజ్ కాబోతోందని ప్రకటించారు. ‘గేమ్ ఛేంజర్’ కోసం వాయిదా వేసుకున్నామని చెప్పారు. కానీ ఇప్పుడు ‘పెద్ది’ రిలీజ్ అయ్యి నెల రోజులు కావస్తున్నా? ‘విశ్వంభర’ చిత్రాన్ని రిలీజ్ చేసింది లేదు. మరోవైపు మెగాస్టార్ చిరంజీవి ‘మన శంకరవరప్రసాద్ గారు’ సినిమాతో పెద్ద బ్లాక్ బస్టర్ కొట్టారు. ఇప్పుడు బాబీ సినిమా షూటింగ్లో బిజీగా గడుపుతున్నారు.
తాను నటించిన ‘విశ్వంభర’ అనే ఓ సినిమా రిలీజ్ కి రెడీగా ఉంది అని ఆయన మర్చిపోయినట్టు ఉన్నారు. లేదు అంటే.. ఆ సినిమాలో నటించడంతో తన పని అయిపోయిందని తప్పించుకుంటున్నారేమో. ఆ విషయాలు పక్కన పెట్టేస్తే.. ‘విశ్వంభర’ సినిమా విడుదలపై మెగా అభిమానులు కూడా ఇంట్రెస్ట్ చూపించడం లేదు. ఇది వాస్తవం. ఎందుకంటే ఫస్ట్ గ్లింప్స్ రిలీజ్ అయినప్పుడు వీ.ఎఫ్.ఎక్స్ చాలా దారుణంగా ఉందని చాలా మంది ట్రోల్ చేశారు.
దీంతో వేరే కంపెనీతో మళ్ళీ వీఎఫ్ఎక్స్ చేయించారు నిర్మాతలు. అది కూడా హీరో చిరంజీవికి నచ్చలేదు అని టాక్. చిరు లైట్ తీసుకున్నట్టు నిర్మాతలు లైట్ తీసుకోలేరు కదా. అందుకే ‘కల్కి 2898 AD’ దర్శకుడు నాగ్ అశ్విన్ ని రంగంలోకి దింపారు. అవును ‘విశ్వంభర’ వీఎఫ్ఎక్స్ కోసం నాగ్ అశ్విన్ సూపర్వైజింగ్ చేస్తున్నారు. కథ, కథనాలతో ఆయనకి సంబంధం లేదు.. కేవలం వీఎఫ్ఎక్స్ కోసం మాత్రం ఆయన పనిచేస్తున్నారట. ఆగస్టు ఎండింగ్ కి ‘విశ్వంభర’ వీఎఫ్ఎక్స్ పనులు ఫినిష్ చేయాలని నాగ్ అశ్విన్ భావిస్తున్నారు.
ఎందుకంటే ఆయన ‘కల్కి 2’ మొదటి షెడ్యూల్ ను సెప్టెంబర్లో ప్రారంభించేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు. మరోవైపు దసరా కానుకగా ‘విశ్వంభర’ ని రిలీజ్ చేయాలని నిర్మాతలైన ‘యూవీ క్రియేషన్స్’ వారు ప్లాన్ చేస్తున్నట్టు వినికిడి.