వెండితెరపైకి నందమూరి నాలుగోతరం నట వారసుడు!

  • May 12, 2016 / 01:25 PM IST

పూరిజగన్నాథ్ దర్శకత్వంలో కళ్యాణ్ రామ్ హీరోగా ఓ చిత్రం తెరకెక్కుతుండగా.. ఈ చిత్రం ఇటీవలే లాంఛనంగా ప్రారంభమవగా.. ప్రస్తుతం ఈ చిత్రం ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ జరుపుకుంటోంది. ఈ చిత్రంలో కళ్యాణ్ రామ్ సరసన మిస్ ఇండియా అదితి ఆర్య జంటగా నటించనుండగా..ఈ చిత్రం ద్వారా కళ్యాణ్ రామ్ తనయుడు శౌర్య రామ్ బాలనటుడిగా ఎంట్రీ ఇవ్వనున్నట్లు సమాచారం.

ఈ చిత్రంలో ఓ చిన్నపిల్లవాడి పాత్ర కీలకంగా ఉండనుందని, ఈ పాత్రను శౌర్య చేత చేయిస్తే బాగుంటుందని పూరి చెప్పగా.. అందుకు కళ్యాణ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని అంటున్నారు. ఎన్‌టి‌ఆర్ ఆర్ట్స్ పతాకం పై నిర్మిస్తున్న ఈ చిత్రం మే 25 నుంచి సెట్స్ పైకి వెళ్లనుంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus