రామలక్ష్మిలాంటి పాత్రను పోషిస్తున్న కళ్యాణి ప్రియదర్శన్

ప్రముఖ దర్శకుడు ప్రియదర్శన్, నటి లిజిల కుమార్తె కళ్యాణి ప్రియదర్శన్ తెలుగువారిని హలో అంటూ పలకరించింది. అక్కినేని అఖిల్ కి జోడిగా నటించి అందరితో అభినందనలు అందుకుంది. ప్రస్తుతం సుధీర్‌ వర్మ దర్శకత్వంలో నటిస్తోంది. ఈ సినిమాలో శర్వానంద్ డ్యూయల్ రోల్ చేస్తున్నారు. ఒకటి లవర్ బాయ్ కాగా.. మరొకటి మిడిల్ ఏజ్ క్యారెక్టర్. 40 ఏళ్ల శర్వానంద్ పక్కన జోడీగా కాజల్ అగర్వాల్ ని తీసుకున్నారు. అలాగే రెండో హీరోయిన్ గా కళ్యాణి ప్రియదర్శి సెలక్ట్ అయ్యింది.

ఈ షూటింగ్ ను విశాఖలో ప్రారంభించారు. ఆ తర్వాత షెడ్యూల్ కాకినాడ పోర్టులో జరగనుంది. ఈ సినిమాలో కొంతభాగం 1980ల కాలంలో జరగనుంది. అప్పటి గొడవలను తెరపైన చూపించనున్నారు. ఆకాలం యువతిగా కళ్యాణి కనిపించనుంది. రీసెంట్ గా రంగస్థలం సినిమాలో సమంత రామలక్ష్మి ఆనాటి అమ్మాయిగా నటించి మంచి మార్కులు కొట్టేసింది. అదే విధంగా కళ్యాణి కూడా యువకుల హృదయాలను కొల్లగొట్టడానికి సిద్ధమవుతోంది. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ ద్వారా సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్న ఈ సినిమా రోజురోజుకి ఆసక్తిని కలిగిస్తోంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus