Kamakshi Bhaskarla : స్మశానంలో శవాల మధ్య కూర్చుంటేనే మనశాంతి లభిస్తుంది : కామాక్షి భాస్కర్ల

టాలీవుడ్‌లో తన అందం మరియు నటనతో గుర్తింపు పొందిన నటి కామాక్షి భాస్కర్ల రీసెంట్ గా చేసిన వ్యాఖ్యలు నెటిజన్లు మధ్య తీవ్ర చర్చకు దారితీసాయి. సినిమాల్లో మాత్రమే కాకుండా, సోషల్ మీడియాలో చేసే పోస్టులు మరియు వీడియోల ద్వారా కూడా ఆమె తరచూ వార్తల్లో నిలుస్తుంటుంది. అదేంటంటే.. కొన్ని సందర్భాల్లో స్మశాన వాతావరణంలో కూర్చుంటే మనసుకు విచిత్రమైన ప్రశాంతత లభిస్తుందని ఆమె చెప్పడం అందరి దృష్టిని ఆకర్షించింది.

Kamakshi Bhaskarla

కామాక్షి భాస్కర్ల సినీ రంగంలోకి రావడానికి ముందు డాక్టర్‌గా పనిచేసిన విషయం చాలా మందికి తెలిసిందే. ఆమె చైనాలో ఎంబీబీఎస్ చదువు పూర్తి చేసి, అనంతరం హైదరాబాద్‌లోని ప్రముఖ ఆసుపత్రిలో కొంతకాలం వైద్యురాలిగా సేవలందించింది. అయితే చిన్నప్పటి నుంచే సినిమాలపై ఉన్న ఆసక్తి కారణంగా ఆమె నటిగా మారాలని నిర్ణయించుకుంది.

2019లో కామాక్షి నటిగా సినీ పరిశ్రమలో అడుగుపెట్టింది. ఆ తర్వాత పలు సినిమాల్లో చిన్న పాత్రలు చేసినప్పటికీ, ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించే అవకాశాలు ఆమెకు క్రమంగా లభించాయి. ముఖ్యంగా ‘మా ఊరి పొలిమేర’ సినిమా ఆమెకు మంచి గుర్తింపును తీసుకువచ్చింది. ఆ చిత్రంలో ఆమె నటనకు మంచి ప్రశంసలు లభించాయి.

తరువాత వచ్చిన ‘పోలిమేర 2’ చిత్రంలో లక్ష్మీ పాత్రలో ఆమె నటన మరింత ఆకట్టుకుంది. ఈ పాత్రకు గాను 2024లో న్యూ ఢిల్లీలో నిర్వహించిన దాదా సాహెబ్ ఫాల్కే ఫిల్మ్ ఫెస్టివల్ కార్యక్రమంలో ఉత్తమ నటి అవార్డు కూడా అందుకుంది. దీంతో కామాక్షి భాస్కర్ల పేరు సినీ వర్గాల్లో మరింతగా వినిపించింది.

నటనతో పాటు తన ప్రత్యేక ఆలోచనలు, ఆసక్తికర వ్యాఖ్యలతో కూడా ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తున్న కామాక్షి భవిష్యత్తులో మరిన్ని విభిన్న పాత్రలతో మెప్పించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు తెలుస్తోంది. ఇది ఇలా ఉండగా అభిమానులు ఆమె కొత్త సినిమాల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Siddu : వరుస సినిమాలతో పవర్ ఫుల్ కంబ్యాక్ ప్లాన్ చేసిన టిల్లు !

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus