సంచలనం సృష్టిస్తున్న సానుభూతి!!!

  • December 7, 2016 / 07:28 AM IST

కమల్ హసన్….జయలలిత ఇద్దరూ…ఎవరికి వారే అన్నట్లు ఉంది పరిస్థితి. అయితే అసలు వారి మధ్య గొడవల్లో నిజం ఎంత ఉందో తెలీదు కానీ..మొత్తానికైతే వారి మధ్య పెద్ద రణమే నడిచింది అనేది తమిళ తంబీల వాదన. ఇదిలా ఉంటే అమ్మ మరణానంతరం కమల్ చేసిన ట్వీట్ ఇప్పుడు పెద్ద దుమారాన్నే రేపుతుంది అంటున్నాయి మీడియా వర్గాలు…అసలు విషయం ఏమిటంటే…కమల్ హసన్ కు జయలలిత కు తొలి నుంచీ పరొక్ష యుద్ధం జరుగుతూనే ఉంది అనేది బహిరంగ రహస్యం. అదే క్రమంలో విశ్వరూపం సినిమా విషయము లో తన సమస్తాన్ని కోల్పోయిన కమల్ హసన్ సినిమా విడుదలకు మోకాలడ్డారనే ఆ సినిమా విడుదలపై బాన్ ను తోలగించలేదని ఆయన్ని సమస్యల్లోకి నెట్టేశారనే భావన ఉంది.

అయితే మరి అది ఆలోచనలో పెట్టుకుని ట్వీట్ చేసారో…లేక మరే ఆలోచనతో అయినా ట్వీట్ చేసారో కానీ…మొత్తానికి అమ్మ మరణం గురించి కమల్ ఇలా ట్వీట్ చేశారు…”జయలలిత మీద ఆధారపడి బతుకుతున్న వారందరికీ నా ప్రగాఢ సానుభూతి”అని. ఇంకేముంది అక్కడ మొదలయింది రచ్చ…దీనిపై జయలలిత అభిమానులకు, అన్నా డీయేంకె నాయకులకు చిర్రెత్తుకొచ్చింది….ఇంకా, అంత్యక్రియలు కూడా పూర్తి కాకముందే కమల్‌ హసన్ ఇలా ఎద్దేవా చేయడంతో వారు కోపంతో రగిలిపోతున్నారు. ఆయన ట్వీట్ కు సమాధానంగా…ట్విట్టర్‌ ద్వారానే కమల్‌ హసన్ ను దుయ్యబడుతున్నారు. “నీకు అభిమానిని అయినందుకు సిగ్గుపడుతున్నానం” అంటూ ఓ అభిమాని ఆమ్మపై తన అభిమానాన్ని చూపిస్తూ…కమల్ కు కౌంటర్ గా రీ-ట్వీట్‌ చేశాడు. మరి ఇప్పుడే మొదలైన ఈ వివాదం ఏక్కడి వరకూ వెళుతుందో అని భయపడుతున్నారు…కమల్ అభిమానులు…చూద్దాం ఏం జరుగుతుందో.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus