ప్రభాస్, మహేష్ పై సంచలన కామెంట్స్ చేసిన కంగనా 

  • December 24, 2018 / 12:51 PM IST

యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ హీరోగా పూరి జగన్నాథ్ డైరెక్షన్లో వచ్చిన ‘ఏక్ నిరంజన్’ చిత్రంతో టాలీవుడ్ కు పరిచయమయ్యింది బాలీవుడ్ నటి కంగనా రనౌత్. ప్రస్తుతం ‘మణికర్ణిక’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అవుతుంది కంగనా. ఝాన్సీ లక్ష్మీభాయ్ జీవిత ఆధారంగా తెరకెక్కిన ‘మణికర్ణిక’ ట్రైలర్ ఇటీవలే విడుదలై.. మంచి రెస్పాన్స్ రాబడుతుంది. ఈ చిత్ర ప్రమోషన్లలో భాగంగా కొన్ని ఆసక్తికరమైన విషయాల్ని తెలిపింది కంగనా.

కంగనా మాట్లాడుతూ.. “సౌత్ లో తనకు సూపర్ స్టార్ మహేష్ అంటే చాలా ఇష్టమని.. వీలైతే.. మహేష్ తో మూవీ చేయాలనుంది కంగనా తెలిపింది. ఇక్కడ చాలా మంది హీరోలంటే నాకు ఇష్టం ఉంది కానీ.. మహేష్ తో కలిసి నటించాలని చాలా కోరిక ఉంది.గతంలో నేను ప్రభాస్‌తో కలిసి నటించాను.అయితే అప్పుడు అతను పెద్ద స్టార్ కాదు. ‘ఏక్ నిరంజన్’ షూటింగ్ టైంలో మేమిద్దరం ఎంతో ఫ్రెండ్లీగా ఉండే వాళ్ళం .. ఒకరినొకరం టీజ్ చేసుకునే వాళ్ళం. ప్రభాస్ మంచి మనసున్న వ్యక్తి. ‘బాహుబలి’ చిత్రంతో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నాడు ప్రభాస్. అప్పటికీ.. ఇప్పటికీ తను చాలా ఎదిగాడు. తన ఎదుగుదల చూస్తుంటే ఎంతో గర్వంగా వుంది. ప్రభాస్ తో మళ్లీ ఒక సినిమా చేయాలనుంది .. ఆ అవకాశం కోసం కచ్చితంగా వదులుకోను” అంటూ చెప్పుకొచ్చింది కంగనా

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus