వాళ్ళు కానీసం మన దేశానికి ట్యాక్సులు కడుతున్నారా

  • March 19, 2018 / 01:09 PM IST

పాకిస్థానీ నటులకు ఇండియన్ మూవీస్ లో ఆఫర్స్ ఇవ్వకూడదని బాల్ థాకరే అండ్ బ్యాచ్ రచ్చ రచ్చ చేయడమే కాక.. పాకిస్థానీ నటులు నటించిన బాలీవుడ్ సినిమాల రిలీజ్ ల విషయంలోనూ గొడవలు చేసిన విషయం తెలిసిందే. అయితే.. ప్రమోషన్స్ లో సదరు పాకిస్తానీ నటులు పాలుపంచుకోకూడదు అనే కండిషన్ మీద షారుక్ ఖాన్ “రయీస్”, రణబీర్ కపూర్ “ఏ దిల్ హై ముష్కిల్” సినిమాలు రిలీజ్ చేయడానికి పర్మిషన్ ఇచ్చారు.

అయితే.. ఆ ఇష్యూని అందరూ మర్చిపోయారు అనుకొంటున్న తరుణంలో మళ్ళీ రైజ్ చేసింది కంగనా రనౌత్. ఇటీవల ఒక ప్రముఖ న్యూస్ చానల్ నిర్వహించిన లైవ్ డిబేట్ లో పాల్గొన్న కంగనా ఈ విషయమై స్పందిస్తూ.. “అసలు పాకిస్థానీ నటులకు అవకాశం ఎందుకు ఇవ్వాలి, వాళ్ళు కనీసం ఇక్కడ ట్యాక్సులు కూడా కట్టరు. అలాంటిది వాళ్ళకి ఆఫర్లు ఎందుకు ఇవ్వాలి” అని ప్రశ్నించింది. ఇప్పుడు కంగనా వ్యాఖ్యలు ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తాయో చూడాలి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus