బాలకృష్ణగారు క్రిష్ ని నమ్మి మోసపోయారు: కంగనా రనౌత్

  • February 25, 2019 / 07:40 PM IST

“మణికర్ణిక” సినిమా విషయంలో డైరెక్టర్ క్రెడిట్స్ విషయంలో క్రిష్-కంగనా నడుమ మధ్య జరిగిన రచ్చ అందరికీ తెలిసిందే. తాను తీసిన అద్భుతాన్ని కంగనా చెడగొట్టిందని క్రిష్ ఓపెన్ స్టేట్మెంట్ ఇస్తే.. అసలు క్రిష్ తీసిన సినిమా నిర్మాతలకే నచ్చలేదని కంగనా రుజువులు బయటపెట్టింది. ఆ ప్రచ్చన్న యుద్ధం కొన్ని నెలలపాటు సాగిందనుకోండి. అయితే.. ఉన్నట్లుండి ఆ ఇష్యూ సైలెంట్ అయిపోయింది. కాకపోతే.. “ఎన్టీఆర్ మహానాయకుడు” సినిమా విడుదలై, సినిమాకి కనీస స్థాయి కలెక్షన్స్ రాకపోవడంతో కంగనా మళ్ళీ క్రిష్ పై దాడి మొదలెట్టింది.

కంగన ఓ బాలీవుడ్ మీడియా సంస్థకు ఇంటర్వ్యూ ఇస్తూ.. “”మణికర్ణిక” సినిమాకి క్రెడిట్స్ నేను కొట్టేశానని అందరూ నన్ను ఆడిపోసుకున్నారు. రాబందుల్లా నన్ను పీక్కుతున్నారు. మరి ఇప్పుడు క్రిష్ తీసిన సినిమా ఫ్లాపయ్యింది. మణికర్ణిక లాంటి సినిమాని ఇంకా బాగా తీయగలను అన్న క్రిష్.. “ఎన్టీఆర్” బయోపిక్ ను ఎందుకు హిట్ చేయలేకపోయాడు. నాకు బాలకృష్ణ గారిని చూస్తే జాలేస్తోంది. పాపం క్రిష్ ని నమ్మి ఆయన చాలా నష్టపోయారు. మరి క్రిష్ ఇప్పుడు ఏం చెబుతాడో చూస్తాను” అంటూ కాస్త ఘాటుగానే స్పందించింది. ప్రస్తుతానికి కంగనా అడిగిన ఏ ఒక్క ప్రశ్నకి క్రిష్ దగ్గర సమాధానం లేదు. మరి మనోడు సైలెంట్ గా ఉంటాడా లేక రెస్పాండ్ అయ్యి ఈ గొడవను ఇంకా సాగదీస్తాడా అనేది చూడాలి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus