అత్యధిక రెమ్యునరేషన్ అందుకున్న కంగనా రనౌత్

వీరనారి రాణీ లక్ష్మీ భాయ్‌ జీవితం ఆధారంగా తెరకెక్కిన మూవీ మణికర్ణిక. ఇందుకోసం బాహుబలి రచయిత విజయేంద్ర ప్రసాద్ కథని సమకూర్చారు. క్రిష్ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ కంగనా రనౌత్‌ లక్ష్మీ భాయ్‌ గా నటించింది. జీ స్టూడియోస్, కమల్ జైన్ సమర్పణలో కైరోస్ కంటెంట్ స్టూడియోస్ బ్యానర్లో సంజయ్ కుట్రీ, నిషాద్ పిట్టిలు వందకోట్లతో నిర్మించిన ఈ మూవీ వచ్చే ఏడాది జనవరి 25 రిలీజ్ కి సిద్ధమవుతోంది. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్ అందరితో శెభాష్ అనిపించుకుంటోంది. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న ఈ సినిమా గురించి ఆసక్తికర సంగతి బయటికి వచ్చింది. ఈ చిత్రంలో నటించినందుకు కంగనా ఏకంగా 14 కోట్ల రెమ్యునరేషన్ అందుకున్నట్టు తెలిసింది.

బాలీవుడ్ లో ఇప్పటివరకు అత్యధిక రెమ్యునరేషన్ అందుకున్న జాబితాలో శ్రీదేవి, ఐశ్వర్య రాయ్, కరీనా కపూర్, ప్రియాంక చోప్రా, దీపికా పదుకొనే తదితరులున్నారు. వీళ్లందరూ తమ క్రేజ్ కి తగినట్టుగానే పారితోషికం తీసుకుంటూ వచ్చారు. అయితే తొలిసారిగా 14 కోట్లు పారితోషికంగా తీసుకున్న నటి మాత్రం కంగనాయేనని బాలీవుడ్ వర్గాలు తెలిపాయి. “మణికర్ణిక” కోసం ఎక్కువ రోజులు కేటాయించాల్సి రావడం… అలాగే ఎక్కువ రిస్క్ తీసుకోవడం వల్లనే ఇంత ఇచ్చినట్టు చెప్పుకుంటున్నారు. ఎలాగైనా అందరికన్నా ఎక్కువగా రెమ్యునరేషన్ అందుకొని కంగనా బాలీవుడ్ క్వీన్ అనిపించుకుంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus