పవన్ కళ్యాణ్, శృతిహాసన్ లపై రొమాంటిక్ సీన్ల చిత్రీకరణలో డాలీ

  • February 21, 2017 / 11:42 AM IST

డాలీ దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటిస్తున్న‘కాటమరాయుడు’ సినిమా 80 శాతం చిత్రీకరణ పూర్తిచేసుకుంది. నార్త్ స్టార్ ఎంటర్ టైన్మెంట్స్ పతాకంపై శరత్ మరార్ నిర్మిస్తున్న ఈ మూవీ ఆఖరి షెడ్యూల్ ఈ రోజు నుంచి మొదలయింది. ఇప్పటివరకు యాక్షన్ సీన్స్ మొత్తం కంప్లీట్ చేసిన డైరక్టర్ ఇప్పుడు శృతిహాసన్, పవన్ కళ్యాణ్ పై రొమాంటిక్ సన్నివేశాలను షూట్ చేయనున్నారు. ఇందుకోసం విదేశీ టూర్లో ఉన్న  శృతిహాసన్ ఈరోజే హైదరాబాద్ తిరిగొచ్చింది. వచ్చి రాగానే ‘హలో హైదరాబాద్. కాటమరాయుడు షూట్ కోసం తిరిగొచ్చాను. ముందు ముందు చాలా పని ఉంది’ అంటూ ట్విట్టర్ లో పోస్ట్ చేసింది.

గబ్బర్ సింగ్ లో పవన్, శృతి మధ్య ఉండే లవ్ సీన్స్ బాగా ఎంటర్టైన్ చేశాయి. కాటమరాయుడులోను అదే విధంగా ఆకట్టుకోవాలని డాలీ ప్రయత్నిస్తున్నారు. రాయలసీమ నేపథ్యంలో సాగే ఈ కథలో పవర్ స్టార్ తొలిసారి ఫ్యాక్షన్ లీడర్ గా నటిస్తున్నారు. అనూప్ రూబెన్స్ సంగీతమందిస్తున్న ఈ సినిమా ఉగాది కానుకగా మార్చి 24 న థియేటర్లోకి రానుంది.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus