కీర్తి సురేష్ (Keerthy Suresh) గతేడాది చివర్లో వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. ప్రియుడు ఆంటోనీని హిందూ సంప్రదాయంలో ప్రేమ వివాహం చేసుకుంది. 15 ఏళ్ళ డేటింగ్ తర్వాత వీళ్ళు పెళ్లి చేసుకోవడం జరిగింది. తర్వాత ఈమె సినిమాల్లో నటిస్తుందా? లేదా? అనే ప్రశ్న చాలా మందిలో ఉంది. తర్వాత సినిమాలకు ఇప్పట్లో గుడ్ బై చెప్పేది లేదు అని ఆమె చెప్పకనే చెప్పింది. అయితే గ్లామర్ కి దూరంగా కథాబలం ఉన్న సినిమాలు, పాత్రలు మాత్రమే చేయాలని కీర్తి డిసైడ్ అయినట్లు తెలుస్తుంది.
ప్రస్తుతం కీర్తి (Keerthy Suresh) చేతిలో 3 ప్రాజెక్టులు ఉన్నాయి. అమెజాన్ ప్రైమ్ వీడియో కోసం చేసిన ‘ఉప్పు కప్పురంబు’ (Uppu KappuRambu) జూలై 4న రిలీజ్ కాబోతుంది. అలాగే ‘రివాల్వర్ రీటా’ ‘కన్నెవేది’ వంటి తమిళ ప్రాజెక్టుల్లో కూడా నటిస్తుంది.
ఇక ఈరోజు నిర్వహించిన ‘ఉప్పు కప్పురంబు’ ట్రైలర్ లాంచ్ లో.. మీడియాతో ముచ్చటించారు కీర్తి సురేష్ (Keerthy Suresh). ఇందులో భాగంగా ‘విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) హీరోగా రవికిరణ్ (Ravi Kiran Kola) కోలా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘రౌడీ జనార్దన’ (Rowdy Janardhan) లో మీరు హీరోయిన్ గా నటిస్తున్నారా?’ అంటూ ఓ రిపోర్టర్ ఆమెను ప్రశ్నించాడు. అందుకు ఆమె ‘దీనికి దిల్ రాజు (Dil Raju) క్లారిటీ ఇస్తారు’ అంటూ టక్కున సమాధానం ఇచ్చింది.
సాధారణంగా ఇలాంటి ప్రశ్నల్లో నిజం లేదు అంటే… వెంటనే ‘అందులో నిజం లేదు’ అని తేల్చేస్తారు నటీనటులు. కానీ నిర్మాత దిల్ రాజు చెబుతారు అని బలంగా చెప్పడంతో.. పరోక్షంగా నిజమే అని ఆమె క్లారిటీ ఇచ్చినట్టే..! కాకపోతే నితిన్ (Nithiin) తో దిల్ రాజు నిర్మిస్తున్న ‘ఎల్లమ్మ’ సినిమాలో కూడా కీర్తి సురేష్ (Keerthy Suresh) హీరోయిన్ గా చేస్తున్నట్టు టాక్ నడుస్తుంది. ‘బలగం’ వేణు దీనికి దర్శకుడు. దానికి కీర్తి, దిల్ రాజు ఎప్పుడు క్లారిటీ ఇస్తారు అనేది ప్రశ్నార్థకంగా మారింది.