అభిమాని చెప్పినట్టు చేసిన కైరా అద్వానీ

  • June 19, 2018 / 03:56 PM IST

బాలీవుడ్ బ్యూటీ కైరా అద్వానీ ఒక్క సినిమాతోనే తెలుగు ప్రేక్షకులకు దగ్గరయింది. భరత్ అనే నేను సినిమాలో మహేష్ పక్కన నటించి హిట్ అందుకుంది. విజయంతో పాటు అనేక అవకాశాలు దక్కించుకుంది. ప్రస్తుతం మెగా పవర్‌ స్టార్ రామ్‌చరణ్ హీరోగా బోయపాటి శ్రీను తెరకెక్కిస్తున్న సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోంది. డీవీవీ దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ కొన్నిరోజులుగా హైదరాబాద్‌లో జరుగుతోంది. ఈ షూటింగ్ కి కొన్నికారణాల వల్ల సోమవారం బ్రేక్ ఇచ్చారు. అనుకోకుండా విరామం దొరకడంతో కైరాకి ఏమి చేయాలో తెలియలేదు. అదే విషయాన్నీ అభిమానులతో పంచుకుంది. “ఈ రోజు నాకు షూటింగ్ లేదు. హైదరాబాద్‌లో చూడాల్సిన ప్రదేశాల గురించి చెప్పండి” అంటూ కైరా ట్వీట్ చేసింది. ఆమె ట్వీట్‌కు ఎక్కువమంది అభిమానులు స్పందించారు.

ఒకరు మాత్రం “మీ తొలి తెలుగు సినిమా హీరో మహేష్ బాబు ఇల్లు చూసి రండి” అంటూ సలహా ఇచ్చారు. అభిమాని సలహాను కైరా పాటించింది. మహేష్ ఇంటికి వెళ్లింది. మహేష్ నిన్న షూటింగ్ నిమిత్తం డెహ్రాడూన్ లో ఉన్నారు. సో అతను ఇంటిలో లేరు. దీంతో మహేష్ భార్య నమ్రత, కూతురు సితారతో కలిసి కాసేపు గడిపింది. అలాగే వారితో తీసుకున్న ఫోటోను పోస్ట్ చేసింది. అంతేకాదు.. మహేష్ ఇంటితోపాటు చార్మినార్‌, సాలార్ జంగ్ మ్యూజియమ్‌లను కూడా చూసినట్టు కైరా ట్వీట్ చేసింది. అభిమానుల మాట వినే హీరోయిన్స్ కూడా ఉంటారా ? అని నెటిజనులు ఆశ్చర్యపోతున్నారు. ఈ సంఘటనతో కైరాకు మరింతమంది అభిమానులు ఏర్పడ్డారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus