కైరా అద్వానీ క్రేజ్ చూసి షాక్ అవుతున్న స్టార్ హీరోయిన్స్

  • March 17, 2018 / 06:00 AM IST

కైరా అద్వానీ.. తెలుగు ఆడియన్స్ కి ఈమె గురించి పెద్దగా తెలియదు. క్రికెటర్ ధోనీ బయోపిక్ మూవీ “ఎమ్. ఎస్. ధోనీ” చిత్రంతో హీరోయిన్ గా పరిచమైంది. తొలిసారి భరత్ అనే నేను సినిమా ద్వారా తెలుగు వారికి పరిచయం కాబోతోంది. సూపర్ స్టార్ మహేష్ బాబుకి జోడీగా నటిస్తోంది. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ మూవీ ఫస్ట్ లుక్, టీజర్ వచ్చినప్పటికీ అందులో ఎక్కడా కైరా కనిపించదు. ఈ చిత్రం వచ్చేనెల 20 న రిలీజ్ కానుంది. ఈ చిత్రం విడుదలైన తర్వాత ఆమె నటన చూసి అవకాశాలు వస్తాయా? రావా? అనేది ఆధారపడి ఉంటుంది. కానీ ఆమె లుక్ కూడా బయటికి రాకముందే నిర్మాతలు ఆమె చుట్టూ తిరుగుతున్నారు.

డేట్స్ కోసం క్యూ కడుతున్నారు. భరత్ అనే నేను తర్వాత కైరా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, మాస్ డైరెక్టర్ బోయపాటీ శ్రీను కాంబినేషన్‌లో తెరకెక్కుతున్నచిత్రానికి సైన్ చేసింది. అది కూడా డబల్ పారితోషికానికి. “భరత్ అనే నేను” చిత్రం కోసం 50 లక్షలు రెమ్యునరేషన్‌గా తీసుకున్న కైరా.. రామ్ చరణ్ సినిమా కోసం ఏకంగా కోటి రూపాయలు డిమాండ్ చేసిందని సమాచారం. అయినా ఇవ్వడానికి నిర్మాత ఓకే చెప్పారు. ఇది తెలిసి తెలుగు స్టార్ హీరోయిన్స్ ఆశ్చర్యపోతున్నారు. ఎన్నో సినిమాల్లో నటించి హిట్స్ అందుకున్నప్పటికీ కోటీ రూపాయలు అందుకోవడం హీరోయిన్స్ కి చాలా కష్టమైన పని.. అటువంటిది కైరా రెండో చిత్రానికే రికార్డు సృష్టించిందని సినీ విశ్లేషకులు చెబుతున్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus