మళ్ళీ రచ్చ రచ్చ చేస్తున్న కియారా అద్వానీ..!

  • August 1, 2019 / 04:58 PM IST

‘ఎం.ఎస్.ధోని’ చిత్రంతో హీరోయిన్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంది కియారా అద్వానీ. నిజానికి ఆమె ‘ఫగ్లీ’ చిత్రంతో ఎంట్రీ ఇచ్చినప్పటికీ ‘ఎం.ఎస్.ధోని’ చిత్రంతోనే బాగా ఫేమస్ అయ్యింది. ఆ తరువాత ‘భరత్ అనే నేను’ చిత్రంతో టాలీవుడ్ కు కూడా ఎంట్రీ ఇచ్చి సూపర్ హిట్ ను అందుకుంది. ఆ చిత్రంలో వసుమతి గా టాలీవుడ్ ప్రేక్షకులని కూడా అలరించింది. వెంటనే రాంచరణ్ ‘వినయ విధేయ రామా’ చిత్రంలో హీరోయిన్ గా ఛాన్స్ కొట్టేసింది. ప్రస్తుతం యూత్ కళల రాణిగా మారిపోయింది కియారా.

ఆమె బాలీవుడ్ లో నటించిన ‘కబీర్ సింగ్’ కూడా బ్లాక్ బస్టర్ కావడంతో ఈమె క్రేజ్ మరింత పెరిగింది. ఇదిలా ఉంటే.. తాజాగా కియరా ‘హలో మ్యాగజైన్’ కవర్ పేజీ కోసం ఇచ్చిన ఫోజు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరలవుతుంది. ‘హలో ఇండియా’ ఆగస్టు కవర్ పేజీ కోసం బాలీవుడ్ టాప్ ఫ్యాషన్ డిజైనర్ మనీష్ మల్హోత్రా ఎంతో శ్రద్ధ తీసుకుని ఈ డిజైన్ రూపొందించాడట. బ్లాక్ స్ట్రాప్ లెస్ టాప్ .. బ్లాక్ బాటమ్ .. కాంబినేషన్ గా క్రిస్టల్ నెక్‌లో క‌నిపించిన కియారా కుర్రకారుని ఆకట్టుకుంటుంది.

1

2

3

4

5

6

7

8

9

10


Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus