దాసరి నారాయణరావు ఆరోగ్యం పై బులిటెన్ విడుదల చేసిన కిమ్స్

  • February 2, 2017 / 01:23 PM IST

దర్శకరత్న దాసరి నారాయణరావు ఆరోగ్యం మెరుగుపడుతోందని కిమ్స్ హాస్పిటల్స్ ఎండీ బొల్లినేని భాస్కర్ రావు చెప్పారు. ఈ రోజు సాయంత్రం విడుదల చేసిన హెల్త్ బులిటెన్ లో ఆయన వెల్లడించారు. కొన్ని రోజులుగా ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధితో బాధపడుతున్న దాసరికి ఆరోగ్యం క్షీణించడంతో మూడు రోజుల క్రితం హైదరాబాద్ లోని కిమ్స్ఆస్పత్రిలో జాయిన్ చేశారు. నిపుణుల వైద్య బృందం మెరుగైన వైద్య సేవలను అందిస్తోంది. ఆయన ఆరోగ్యంపై పలువురు సినీ ప్రముఖులు ఆందోళన చెందారు. ఆస్పత్రికి వెళ్లి దాసరి కుటుంబసభ్యులను పరామర్శించారు.

అభిమానులు నిద్రాహారాలు మాని కోలుకోవాలని పూజలు చేశారు. వారందరి కంగారును తగ్గించడానికి కిమ్స్ హాస్పిటల్స్ ఎండీ బొల్లినేని భాస్కర్ రావు “దాసరి ఆరోగ్యం మెరుగుపడింది. డయాలసిస్ అవసరం లేకుండానే చికిత్సకు స్పందిస్తున్నారు. వెంటిలేటర్స్ వైద్యం కొనసాగుతోంది. మూడు, నాలుగు రోజుల్లో సాధారణ పరిస్థితికి వస్తారు.” అని హెల్త్ బులిటెన్ విడుదల చేశారు. దీంతో ఆయన కుటుంబసభ్యులు, ఆత్మీయులు, అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus