తదుపరి సినిమాల ఫై క్లారిటీ ఇచ్చిన కొరటాల

  • July 13, 2017 / 09:54 AM IST

టాలీవుడ్ లో యువ దర్శకుల్లో కొరటాల శివ ఒకడు…కధా రచయితగా…మాటల రచయితగా…కరియర్ మొదలు పెట్టిన శివ తన కథను ఒకరు తెరకెక్కించడం కన్నా తాము రాసుకున్న కథను తానే డైరెక్ట్ చేస్తే ఫీల్ ఎక్కడా మిస్ అయ్యే అవకాశాలు ఉండవు అన్న ఆలోచనతో డైరెక్టర్ గా మారి మిర్చిగా మంచి హిట్ అందుకుని…శ్రీమంతుడుతో ఇండస్ట్రీ హిట్ ఇచ్చి…ఇక ఎన్టీఆర్ తో జనతా గ్యారేజ్ చేరి బ్లాక్ బష్టర్ హిట్ అందుకున్నాడు…ఇక ఇక ప్రస్తుతం మహేష్ తో భరత్ అను నేను సెట్స్ మీద ఉండగా ఆల్రెడీ ఎన్.టి.ఆర్ తో మరో సినిమా ముహుర్తం పెట్టేశాడు కొరటాల శివ. ఇవే కాకుండా లేటెస్ట్ గా చరణ్ తో మరో సినిమా లైన్ లో పెట్టాడు ఇదిలా ఉంటే అసలైతే ప్రిన్స్ తో సినిమా తరువాత ఎన్టీఆర్ తో ఒక సినిమా చెయ్యాలి మన కొరటాల కానీ…ఎన్టీఆర్ కన్నా…చెర్రీతోనే సినిమా తీసేందుకు రెడీ అయ్యాడు కొరటాల…దానికి కారణం ఏంటి అంటే….తారక్ తో త్రివిక్రం కమిట్మెంట్ ఉండటంతో చరణ్ తో సినిమా ఫిక్స్ చేసుకున్నాడట మన కొరటాల శివ.

అందుకే తారక్ కంటే ముందే చరణ్ తో కొరటాల శివ సినిమా చేస్తున్నాడు. ఇక ఈ సినిమా వివరాల్లోకి వెళితే…నిరంజన్ రెడ్డి అనే నిర్మాత ఈ సినిమాని నిర్మిస్తున్నాడట…ఇక 2018 సమ్మర్ లో ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది. మరో పక్క ప్రిన్స్ మహేష్ భరత్ అను నేను మూవీ వచ్చే సంక్రాంతికి రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. అది ఒకవేళ లేట్ అయినా సమ్మర్ కల్లా చరణ్ మూవీ సెట్స్ మీదకు వెళ్తుందని అంటున్నారు. ఇక తారక్ ప్రస్తుతం జై లవకుశ సెప్టెంబర్ కల్లా రిలీజ్ చేసి ఆ తర్వాత త్రివిక్రం తో సినిమా షురూ చేస్తున్నాడు. మొత్తంగా చూసుకుంటే కొరటాల బడా హీరోలతో మంచి బిజీగా గడిపేస్తూ సూపర్ హిట్ సినిమాలు అందిస్తున్నాడు.


Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus