తనపై వచ్చిన వార్తలపై స్పందించిన కుష్బూ

  • August 14, 2018 / 10:33 AM IST

సీనియర్ నటి కుష్బూ గురించి దక్షిణాది ప్రజలకు ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తెలుగు, తమిళం, మలయాళం మాత్రమే కాకుండా హిందీ భాషల్లో నటించి మంచి పేరు తెచ్చుకున్నారు. హీరోయిన్ గా అనేక విజయాలు అందుకున్న ఈమె క్యారక్టర్ ఆర్టిస్టుగానూ అభినందనలు అందుకుంటున్నారు. స్టాలిన్ సినిమాలో చిరంజీవికి అక్కగా నటించిన కుష్బూ.. రీసెంట్ గా అజ్ఞాతవాసిలోనూ పవన్ కళ్యాణ్ కి పిన్నిగా నటించి మెప్పించారు. వెండితెర, బుల్లితెరపై పలు కార్యక్రమాలతో బిజీగా ఉన్న ఈమె.. రాజకీయాల్లోనూ చురుకుగా ఉన్నారు. తాజాగా ఆమెపై ఓ న్యూస్ షికారు చేస్తోంది.

పవర్ స్టార్ పవన్‌కల్యాణ్, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో తెరకెక్కిన “అత్తారింటికి దారేది!” సూపర్ హిట్ అయింది. ఈ మూవీని తమిళంలో శింబూ హీరోగా రీమేక్ చేయనున్నట్లు ప్రచారం సాగుతోంది. తెలుగులో నదియా పోషించిన “సునంద”(అత్త) పాత్రని తమిళంలో కుష్బూ పోషిస్తున్నారనే వార్త సోషల్‌మీడియాలో వైరల్ అయింది. ఈ న్యూస్ చూసి కుష్బూ ఆశ్చర్యపోయారు. వెంటనే స్పందించారు. ”అసలు నాకు ఈ విషయం తెలియదు.. ఎక్కడి నుంచి వస్తాయి ఇలాంటి వార్తలు” అని ఆమె ట్వీట్ చేశారు. అజ్ఞాతవాసి విజయం సాధించకపోవడంతో ఇప్పుడు ఆమె ఏ కథలని వినడం లేదు. బుల్లితెర ప్రాజక్ట్స్ కోసం పనిచేస్తున్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus