మీడియా వారికి క్షమాపణలు చెప్పిన ఖుష్బూ..!

  • June 10, 2020 / 05:37 PM IST

తమిళ ప్రేక్షకులతో పాటు తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితమైన నటి ఖుష్బూ.. ఇటీవల తన స్నేహితులతో మాట్లాడుతూ మీడియా పై నెగెటివ్‌ కామెంట్స్ చేసినట్టు ఓ వీడియో హల్ చల్ చేస్తుంది. దీంతో ఆమె పై విమర్శలు గుర్పిస్తున్నారు నెటిజన్లు. ఈ విషయం తెలుసుకున్న ఖుష్బూ వెంటనే తన ట్విట్టర్ ద్వారా స్పందించి క్షమాపణలు తెలిపింది. ‘నా వాయిస్‌ను ఎవరో ఎడిట్‌ చేసి’ ఆ వీడియో కు జత చేశారని ఆమె చెప్పుకొచ్చింది.

అసలు విషయాన్ని పరిశీలిస్తే ఆ వీడియోలో ఖుష్బూ.. ‘మీడియా వారికి లాక్ డౌన్ గురించి తప్ప మరొక వార్త దొరకట్లేదని, ఇప్పుడు షూటింగ్స్ ప్రారంభం అవుతాయి కాబట్టి పాత్రికేయులకు.. సినీనటులకి సంబంధించిన వార్తలు రాసేందుకు సిద్ధమవుతున్నారని చెప్పుకొచ్చింది. అంతేకాదు పాత్రికేయులకు అవకాశం ఇవాలే కానీ సొంతంగా క‌థ‌లు అల్లేసి ప్రచారం చేస్తారని.. వారికి ఫోటోలు, వీడియోలు వంటివి ఇవ్వకుండా జాగ్రత్త పడాలని’ ఆ వీడియోలో ఖుష్బూ మాట్లాడినట్టు ఉంది.ఈ విషయం పై స్పందించిన ఖుష్బూ.. ” మీడియా పట్ల నాకు చాలా గౌరవం ఉందన్న విషయం పాత్రికేయులందరికీ తెలుసు.

నేను ఇప్పటివరకూ ఒక్కసారి కూడా వారి గురించి అగౌరవంగా మాట్లాడలేదు. నేను ఎవరినైనా బాధపెట్టినట్లయితే నన్ను క్షమించండి. నేను మీడియా వారి పై వ్యాఖ్యలు చేసినట్టు ఉన్న ఆ క్లిప్ నిర్మాతల నుండి బయటకి వచ్చిందని అనుమానిస్తున్నాము. ఈ పని ఏ నిర్మాత చేసి ఉంటాడో నాకు తెలుసు. నేను అతడి పేరును మాత్రం బయట పెట్టను. నా మౌనమే‌ అతడికి పెద్ద శిక్ష” అంటూ పేర్కొంది.

Most Recommended Video

మేకప్‌ లేకుండా మన టాలీవుడ్ ముద్దుగుమ్మలు ఎలా ఉంటారో తెలుసా?
జ్యోతిక ‘పొన్‌మగల్‌ వందాల్‌’ రివ్యూ
ఈ డైలాగ్ లు చెప్పగానే గుర్తొచ్చే హీరోయిన్లు!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus