తమిళ దర్శకుడితో కీర్తి సురేష్ ఒప్పందం కుదుర్చుకుందా..?

  • October 25, 2016 / 10:13 AM IST

ఎంట్రీ ఇచ్చి ఏడాది అయ్యిందో లేదో యువహీరోలతో పాటు వరుసగా స్టార్ హీరోల సినిమాల్లో అవకాశాలు అందుకుంటుందని దక్షిణాది హీరోయిన్లంతా ఇప్పుడు ఆమెను చూసి అసూయ పడుతున్నారు. ముఖ్యంగా కోలీవుడ్ భామామణులంతా కుళ్ళుకుంటున్నారు. ఇంతకీ ఆమె ఎవరో చెప్పనేలేదు కదూ. శైలజగా ఈ ఏడాది ఆరంభంలో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన కీర్తి సురేష్. ఈ ఏడాది ఇప్పటికే 4 సినిమాలతో విజయాలు అందుకున్న ఈమె ఓ తమిళ దర్శకుడితోన్ వరుసగా రెండు సినిమాలు చేస్తుండటంతో అతగాడితో కీర్తి ఒప్పందం కుదుర్చుకుందా అని కోలీవుడ్ వర్గాలు గుసగుసలాడుతున్నాయి.

కీర్తి నటించిన తొడరి (తెలుగులో రైల్), రెమో సినిమాలు ఇటీవల తెరమీదికొచ్చిన సంగతి తెలిసిందే (తెలుగులో విడుదల కావాల్సి ఉంది). తమిళ స్టార్ హీరో విజయ్ సరసన నటించిన ‘భైరవ’ షూటింగ్ పూర్తి చేసుకుని సంక్రాతి విడుదలకు ముస్తాబవుతోంది. అంతలోనే విగ్నేష్ శివన్ తెరకెక్కించనున్న ‘తాన సెరిందా కూట్టమ్’ సినిమాలో సూర్యకు జంటగా నటిస్తోన్న కీర్తి తమిళ దర్శకుడు లింగుసామి చేయనున్న ‘సండకోళి’ (తెలుగులో పందెంకోడి) సీక్వెల్ లో విశాల్ తో కలిసి నటించనుందట. దీంతోపాటు లింగుసామి దర్శకత్వం వహించనున్న ద్విభాషా చిత్రంలో అల్లు అర్జున్ సరసన ఆడిపాడనుందట ఈ అందాల సుందరి. ఏమైనా కీర్తి దక్షిణాదిన తన హవా చాటుతుందన్నది అనుమానం లేని విషయం.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus