మహేష్ చిత్రానికి అమెరికాలో మొదలైన పాటల కంపోజింగ్!

  • October 23, 2017 / 07:08 AM IST

సూపర్ స్టార్ మహేష్ బాబు 25 వ మూవీ పనులు వేగంగా సాగుతున్నాయి. మహేష్ భరత్ అనే నేను సినిమా షూటింగ్ లో ఉండగా.. డైరక్టర్ వంశీ పైడి పల్లి మాత్రం తమ చిత్రం కోసం కొని రోజుల క్రితం అమెరికాకు వెళ్లారు. డీఓపీ పీఎస్ వినోద్, ప్రొడక్షన్ డిజైనర్ సునీల్ బాబు తో కలిసి న్యూ యార్క్ లోని అందమైన లొకేషన్స్ ని సెలక్ట్ చేశారు. లొకేషన్స్ సెట్ కావడంతో ఇప్పుడు మ్యూజిక్ పని మొదలు పెట్టారు. మహేష్ 24 వ చిత్రానికే కాదు 25 వ చిత్రానికి కూడా రాక్ స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నారు.

భరత్ అనే నేను పాటల కంపోజింగ్ పూర్తి చేసిన దేవీ ఇప్పుడు నెక్స్ట్ సినిమా ట్యూన్స్ కంపోజింగ్ లో పడ్డారు. అమెరికాలోనే వంశీ తో కలిసి దేవీ సిట్టింగ్ వేశారు. ఈ సిట్టింగ్స్ లో నిర్మాత దిల్ రాజు కూడా ఉన్నట్లు తెలిసింది. మహేష్ కెరీర్ లో మైలురాయిగా చెప్పుకునే ఈ సినిమా వచ్చే ఏడాది సెట్స్ మీదకు వెళ్లనుంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus