మహేష్ తర్వాతి సినిమాలోను స్క్రీన్ చేసుకోనున్న మరో హీరో

  • August 14, 2018 / 07:51 AM IST

కథ నచ్చితే చాలు.. ప్రశ్నలను వదిలేసి .. పనిచేసుకుంటూ వెళ్లే హీరో మహేష్ బాబు. ఏ హీరోతోనైనా కలిసి నటించడానికి తాను సిద్ధమేనని నిరూపించిన హీరో అతను. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాలో వెంకటేష్ తో కలిసి నటించి.. తనకు ఎటువంటి ఈగోలు లేవని చాటి చెప్పారు. ప్రస్తుతం వంశీ పైడిపల్లి దర్శకత్వంలో మహర్షి అనే సినిమా చేస్తున్నారు. అశ్వినీదత్, దిల్ రాజు, పీవీపీ కలిసి నిర్మిస్తున్న ఈ మూవీ షూటింగ్ వేగంగా సాగుతోంది. ఇందులో అల్లరి నరేష్ తో కలిసి నటిస్తున్నారు. అందుకే ఇది ఒక రకంగా మల్టీస్టారర్ మూవీ అని చెప్పాలి. ఈ చిత్రం తర్వాత మహేష్ చేయనున్న మూవీలోనూ మరో హీరో నటించనున్నట్లు తెలిసింది. మహర్షి తర్వాత సుకుమార్ దర్శకత్వంలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే.

రంగస్థలం తర్వాత సుకుమార్.. మహేష్ కోసం స్క్రిప్ట్ సిద్ధం చేస్తున్నారు. కథ పరంగా ఇందులో ఓ ముఖ్యమైన పాత్ర ఉందంట. దాదాపు 20 నిముషల నిడివిగల ఆ పాత్రను ఓ హీరో పోషిస్తే బాగుంటుందని సుకుమార్ మహేష్ కి చెప్పగానే.. ఆలోచించకుండా ఒకే చెప్పినట్టు సమాచారం. ఆ హీరో ఎవరు అనేది ఇంకా తెలియదు. డేట్స్ సర్దుబాటు అయిన తర్వాత ఆ విషయాన్ని అధికారికంగా ప్రకటించనున్నారు. సుకుమార్, మహేష్ బాబు కలయికలో వచ్చిన నేనొక్కడినే మూవీ నిరాశపరిచింది. ఈసారి ఎలాగైనా మహేష్ కి హిట్ ఇవ్వాలనే ఉద్దేశంతో సుకుమార్ శ్రమిస్తున్నారు. ఈసారి ఎటువంటి కథని తీసుకొస్తారోనని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus