గరుడ వేగ సినిమా బృందానికి మహేష్ అభినందనలు!

  • November 11, 2017 / 07:59 AM IST

ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో డాక్టర్ రాజశేఖర్ నటించిన యాక్షన్ ఎంటర్‌టైన‌ర్ “పి.ఎస్.వి గరుడ వేగ 125.18” గత శుక్రవారం రిలీజ్ అయి మంచి స్పందన అందుకుంది. అత్యధిక బడ్జెట్ తో తెరకెక్కిన ఈ మూవీ  తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 230 థియేటర్స్ లో రిలీజై  తొలి రోజు రోజు 2.30 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. రాజశేఖర్ కి మంచి కమ్ బ్యాక్ మూవీగా నిలిచింది. ఈ సినిమా సామాన్యులకే కాదు  సెలబ్రిటీలకు తెగ నచ్చేసింది. భరత్ అను నేను మూవీ షూటింగ్ లో బిజీగా ఉన్న మహేష్ బాబు రీసెంట్ గా గరుడ వేగ చిత్రాన్ని చూసి ఆశ్చర్యపోయారు. తన ఫీలింగ్స్ ని ట్విట్టర్ వేదికగా పోస్ట్ చేశారు.

“గ్రేట్ స్క్రిప్ట్… గుడ్  పెరఫార్మన్సెస్… స్లిక్ స్క్రీన్ ప్లే .. స్టన్నింగ్ పి.ఎస్.వి గరుడ వేగ … ఈ చిత్ర బృందం బాగా వర్క్ చేశారు” అంటూ అభినందనలు గుప్పించారు. ప్రతి తెలుగు సినిమాని చూసి.. నచ్చిన చిత్రం గురించి ట్వీట్స్ చేయడం మహేష్ కి అలవాటు. రీసెంట్ గా వచ్చిన వాటిలో పి.ఎస్.వి గరుడ వేగ నచ్చడం ఆ చిత్ర బృందానికి మరింత ఆనందాన్ని కలిగించింది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus