నాలుగురోజుల్లో మూడో స్థానానికి ‘భరత్’

  • April 24, 2018 / 07:46 AM IST

పొలిటికల్ నేపథ్యంలో రూపుదిద్దుకున్న ‘భరత్ అనే నేను’ సినిమాతో సూపర్ స్టార్ మహేష్ బాబు మళ్లీ హిట్ ట్రాక్ లోకి వచ్చారు. మహేష్ ఫ్యాన్స్ కి ఇచ్చిన హామీని డైరక్టర్ కొరటాల శివ నెరవేర్చుకున్నారు. గత శుక్రవారం రిలీజ్ అయిన ఈ సినిమా మూడు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా వంద కోట్ల గ్రాస్ వసూలు చేసి మహేష్ బాబు సత్తాని చాటింది. బాలీవుడ్ బ్యూటీ కైరా అద్వానీ హీరోయిన్ గా నటించిన ఈ మూవీ తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఓవర్సీస్ లోను దూకుడు ప్రదర్శిస్తోంది. ప్రీమియర్ షోలు, ఓపెనింగ్స్ ద్వారా మొదటిరోజే యూఎస్ లో దాదాపు ఒకటిన్నర మిలియన్లను వసూలు చేసిన ఈ సినిమా ఆదివారం నాటికి 2.48 మిలియన్ డాలర్లను క్రాస్ చేసింది.

సోమవారం లక్ష డాలర్లను రాబట్టి 2.5 మిలియన్ల మైలు రాయిని దాటింది. బాహుబలి కంక్లూజన్, బిగినింగ్ చిత్రాల తర్వాత వేగంగా 2.5 మిలియన్ ను అందుకున్న 3వ తెలుగు చిత్రంగా “భరత్ అనే నేను” నిలిచింది. అంతేగాక ఆల్ టైమ్ బెస్ట్ గ్రాసర్లలో బాహుబలి-1, 2, రంగస్థలం, శ్రీమంతుడు వంటి చిత్రాల తర్వాతి స్థానంలో భరత్ అనే నేను నిలిచింది. త్వరలోనే మహేష్ బాబు తన రికార్డును తానే బద్దలు కొట్టనున్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus