దిల్ రాజు ప్లానింగ్ పుణ్యమా అని సేఫ్ అయిపోయిన మహేష్

  • April 30, 2019 / 07:23 PM IST

దిల్ రాజు “మహర్షి” చిత్రాన్ని ఏప్రిల్ 26 విడుదలను పోస్ట్ పోన్ చేసి మే 9ని కొత్త డేట్ గా ప్రకటించినప్పుడు మహేష్ బాబు ఫ్యాన్స్ అందరూ దిల్ రాజును సోషల్ మీడియాలో తిట్టినతిట్టు తిట్టకుండా తిట్టారు. కానీ.. ఇప్పుడు అదే ఫ్యాన్స్ దిల్ రాజు ప్లానింగ్ ను మెచ్చుకోంటూ ధన్యవాదాలు చెబుతున్నారు. అందుకు కారణం లేకపోలేదు. పొరపాటున “మహర్షి” సినిమా గనుక ముందు ప్రకటించినట్లుగా ఏప్రిల్ 26న విడుదలై ఉంటే.. ఆదేరోజున విడుదలైన హాలీవుడ్ చిత్రం “అవెంజర్స్ ఎండ్ గేమ్” ధాటికి నిలవలేకపోయేది.

ఓవర్సీస్ లో మాత్రమే కాదు.. ఇండియన్ మార్కెట్ కు కూడా మహర్షి సినిమాకి ఎండ్ గేమ్ గట్టి పోటీ ఇచ్చేది. అందువల్ల సినిమా ప్రారంభ వసూళ్లు మాత్రమే కాదు.. ఫస్ట్ వీక్ కలెక్షన్స్ కి కూడా భారీ గండి కొట్టేది. ఈ విషయాన్ని ముందుగానే గ్రహించిన దిల్ రాజు మహర్షిని సేఫ్ జోన్ లో పడేయడం కోసం మే 9కి పోస్ట్ పోన్ చేశాడు. లేదంటే అసలే బ్యాడ్ టాక్ నడుస్తున్న మహర్షి సినిమాకి అవెంజర్స్ రిలీజ్ పెద్ద అడ్డంకిగా మారేది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus