సూపర్ స్టార్ ని భయపెట్టిన విషయం ఏమిటి ?

  • October 22, 2016 / 07:17 AM IST

“భయానికి మీనింగ్ తెలియని బ్లడ్ రా నాది..” దూకుడు సినిమాలో మహేష్ బాబు చెప్పే డైలాగ్ ఇది. సినిమాలోనే కాదు బయట కూడా ప్రిన్స్ అలాగే ఉంటారు. డూప్ లేకుండా స్టన్స్ చేయడం ప్రిన్స్ కి చిన్నప్పటి నుంచి అలవాటే. మరి ఎందుకు భయపడ్డారని ఆలోచిస్తున్నారా? ఆ విషయంలోకి వద్దాం…పూరీ జగన్నాధ్ దర్శకత్వంలో ప్రిన్స్ మహేష్ బాబు “పోకిరి, బిజినెస్ మెన్” సినిమాలు చేశారు. ఈ రెండు ఊహించని రీతిలో భారీ విజయాన్ని అందుకున్నాయి.

సూపర్ స్టార్ కెరీర్ లో బెస్ట్ చిత్రాలైన వీటికి సీక్వెల్స్ చేద్దామని పూరీ జగన్నాధ్ చాలా సార్లు అనుకున్నారు. కానీ కుదరలేదు. కారణం ఏమిటని డైరక్టర్ ని అడిగితే .. సీక్వెల్ కి మహేష్ బయపడి వద్దన్నాడని వివరించారు. ఆయన రీసెంట్ గా ఇచ్చిన ఇంటర్వ్యూ లో ఈ విషయాన్నీ బయటపెట్టారు. పోకిరి కి సీక్వెల్ అంటే క్రేజీ గానే ఉంది కానీ తేడా వస్తే మాత్రం గత రికార్డు కూడా కొట్టుకుపోతుంది. పైగా తెలుగు చిత్రపరిశ్రమకు సీక్వెల్ సెంటిమెంట్ వర్కవుట్ కాలేదు. ఈ విషయాలను దృష్టిలో పెట్టుకునే మహేష్ బాబు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఉన్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus