Mahesh Babu: మహేష్- రాజమౌళి మధ్య ఫైట్.. ‘సినిమా చచ్చిపోతుంది’ అంటున్న ఆర్జీవీ

ఇంటర్నెట్ వాడకం పెరిగిన తర్వాత మార్ఫింగ్ అనేది పుట్టుకొచ్చింది. కాకపోతే ఆ టైమ్లో ఒరిజినల్ ఏదో, డూప్లికేట్ ఏదో అంచనా వేసే అవకాశం ఉండేది. కానీ ఏఐ అందుబాటులోకి వచ్చాక ఏది ఒరిజినలో, ఏది ఫేకో అంచనా వేయడం కష్టంగా మారింది. తరచూ వాడేవాళ్లు లేదా చూసేవాళ్ళు అయితే కనిపెట్టే అవకాశం ఉంటుంది. కానీ దీనిపై అవగాహన లేని వాళ్ళు నమ్మి మోసపోయే అవకాశం ఎక్కువగానే ఉంది.

Mahesh Babu

సోషల్ మీడియాలో ఇప్పుడు హీరో, లేదా హీరోయిన్ ఫోటో కనిపిస్తే.. అది ఒరిజినలా? కాదా? అనేది వాళ్ళ అఫిషియల్ హ్యాండిల్ కి వెళ్ళి చెక్ చేసుకోవాల్సి వస్తుంది. ఇది ట్రోలర్స్ కి ఆయుధంగా కూడా మారిపోయింది అని చెప్పొచ్చు. ట్రోల్ స్టఫ్ కోసం వాళ్ళు ఏఐ ని దారుణంగా వాడటం మనం చూస్తూనే ఉన్నాం. కొంతమంది అయితే ఏఐని వాడి సినిమాలు కూడా తీసేసి యూట్యూబ్లో రిలీజ్ చేసేస్తున్నారు.

ఇంకొంతమంది హీరోయిన్ల ఫోటోలను వల్గర్ గా మార్చి షేర్ చేస్తున్నారు.మరికొంతమంది ఆకతాయిలు అయితే ఇంకా నెక్స్ట్ లెవెల్ కి వెళ్లిపోతున్నారు.  సరే ఈ విషయాలు పక్కన పెట్టేస్తే.. ఇప్పుడు ఏకంగా ఓ స్టార్ హీరో? స్టార్ డైరెక్టర్ గొడవ పడుతున్నట్టు ఓ వీడియో కూడా క్రియేట్ చేసేశారు. ఆ స్టార్ హీరో, డైరెక్టర్ మరెవరో కాదు రాజమౌళి, మహేష్ బాబు(Mahesh Babu). అవును ఈ స్టార్లు ఇద్దరూ గొడవపడుతున్నట్టు ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

ఇది ఏఐ తో చేసిన వీడియో.దీనిని దర్శకుడు రాంగోపాల్ వర్మ షేర్ చేసి ‘సినిమా చచ్చిపోతుంది’ అంటూ కామెంట్ చేశారు. దీంతో అది మరింతగా వైరల్ అవుతుంది.

హరీష్ వీడియో చేసి తప్పు చేశాడా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus