మహేష్ నో చెప్పడంతో కొత్త లైన్ వినిపించిన సుకుమార్

  • August 29, 2018 / 08:12 AM IST

సుకుమార్ దర్శకత్వ ప్రతిభని మెచ్చి సూపర్ స్టార్ మహేష్ బాబు పిలిచి ఛాన్స్ ఇచ్చారు. పూర్తిగా అతనిపై భరోసాతోనే వన్ నేనొక్కడినే సినిమా చేశారు. అది అంచనాలను తారుమారు చేసింది. హాలీవుడ్ సినిమాలా ఉందని సినీ విశ్లేషకులు ప్రశంసించినప్పటికీ కాసులు కురవలేదు. ఇద్దరినీ బాగా డిసప్పాయింట్ చేసింది. అప్పటి నుంచి మహేష్ తో హిట్ కొట్టాలని సుకుమార్ సంకల్పించుకున్నారు. మంచి హిట్ కొట్టి కలవాలనుకున్నారు. రంగస్థలం మూవీ తర్వాత మహేష్ వద్దకు వాలిపోయారు. రంగస్థలం వంటి కథని వినిపించారు. ఆ కథ బాగున్నప్పటికీ మహేష్ నిర్మొహమాటంగా నో చెప్పారు. పాతకాలం నాటి కథలు రంగస్థలం, మహానటి హిట్ కావడంతో అనేకమంది పీరియాడిక్ ఫిల్మ్ నే ప్లాన్ చేసారు. రాజమౌళితో పాటు చిన్న హీరోలు సైతం అదే దారిలో వెళ్తున్నారు.

అదే బాటలో నడవడానికి ఇష్టపడని మహేష్ బాబు వీరే జోనర్ లో కథ చెప్పమని కోరారంట. పది రోజులు గ్యాప్ తీసుకొని కొత్త లైన్ వినిపించారంటా. అందుకు మహేష్ ఓకే చెప్పడంతో సుకుమార్ స్క్రిప్ట్ సిద్ధం చేసే పనిలో పడిపోయారు. ప్రస్తుతం వంశీ పైడిపల్లి దర్శకత్వంలో మహేష్ మహర్షి అనే సినిమా చేస్తున్నారు. అశ్వినీదత్, దిల్ రాజు, పీవీపీ కలిసి నిర్మిస్తున్న ఈ మూవీ షూటింగ్ వేగంగా సాగుతోంది. పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా ఉగాది కానుకగా ఏప్రిల్ 5 న రిలీజ్ కానుంది. ఆ తర్వాత సుకుమార్ ప్రాజెక్ట్ పట్టాలెక్కనుంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus