క్రిస్మస్ సెలవులను పిల్లలతో ఎంజాయ్ చేయనున్న ప్రిన్స్

  • November 28, 2016 / 09:42 AM IST

ప్రొఫిషనల్, పర్సనల్ లైఫ్ ని చక్కగా ప్లాన్ చేసే హీరోల్లో సూపర్ స్టార్ మహేష్ బాబు ఒకరు. స్టార్ గా ఓ వైపు బిజీగా ఉంటూనే తండ్రిగా పిల్లలతో ఎక్కువ సేపు గడుపుతుంటారు. వీలు ప్రస్తుతం మురుగ దాస్ దర్శకత్వంలో నటిస్తున్న మహేష్.. అహ్మదాబాద్ కి వెళ్లారు. అక్కడే డిసెంబర్ 22 వరకు చిత్రీకరణలో పాల్గొంటారు. అనంతరం హైదరాబాద్ కి రానున్న ప్రిన్స్.. భార్య నమ్రత, పిల్లలు గౌతమ్, సితార లతో కలిసి ఇంగ్లాండ్ వెళ్లనున్నారు.

ఆ దేశంలోని సుందర ప్రదేశాలను పిల్లలకు చూపించనున్నారు. క్రిస్మస్ వేడుకను అక్కడే జరుపుకోనున్నారు. కొత్త సంవత్సరానికి ఘనంగా స్వాగతం పలకనున్నారు. పర్యటనను ముగించుకొని వచ్చిన తర్వాత మిగిలిన సినిమాను పూర్తి చేయనున్నారు. మురుగ దాస్ చిత్రం పూర్తి అయినా వెంటనే సూపర్ స్టార్ కొరటాల శివతో కలిసి పనిచేయనున్నారు.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus