ముంబైలో విశ్రాంతి తీసుకుంటున్న మహేష్ ఫ్యామిలీ

  • December 9, 2017 / 01:29 PM IST

కాస్త సమయం దొరికినా కుటుంబ సభ్యులతో మహేష్ బాబు గడుపుతాడన్న సంగతి అందరికీ తెలిసిందే. స్పైడర్ తర్వాత అతను కొరటాల శివ దర్శకత్వంలో చేస్తున్న భరత్ అనే నేను సినిమాని మొదట సంక్రాంతికి విడుదల చేయాలనీ అనుకున్నారు. కానీ ఈ సినిమాని ఏప్రిల్ 27 కి పోస్ట్ ఫోన్ చేశారు. దీంతో చాలా గ్యాప్ దొరికింది. తొందరపడకుండా రిలాక్స్ గా కొరటాల షెడ్యూల్ వేశారు. షెడ్యూల్ షెడ్యూల్ కి గ్యాప్ ఉంది. ఆ గ్యాప్ లో విదేశాలకు వెళ్లకుండా ముంబై లోనే భార్య నమ్రత, పిల్లలు గౌతమ్, సితార తో కలిసి మహేష్ గడుపుతున్నారు. కొత్త షెడ్యూల్ డిసెంబర్ 13 నుండి 26 వరకు తమిళనాడులోని కారైకుడిలో జరగనుంది.

ముంబై నుంచి అటునుంచి అటే మహేష్ తమిళనాడుకు వెళ్లనున్నారు. అక్కడ ఒక యాక్షన్ సీన్ తో పాటు కొన్ని సన్నివేశాలు తెరకెక్కించనున్నారు. ఈ షెడ్యూల్ తో 90 శాతం టాకీ పార్ట్ పూర్తవుతుంది. మిగిలిన మూడు పాటలు, ఒక ఫైట్ ను జనవరిలో చిత్రీకరించనున్నారు. ప్రముఖ నిర్మాత డివివి దానయ్య నిర్మిస్తున్న ఈ చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ కైరా అద్వానీ హీరోయిన్ గా నటిస్తోంది. ముఖ్యమంత్రిగా మహేష్ నటిస్తున్న ఇందులో ప్రతి పక్షనేతగా పోసాని కృష్ణమురళి నవ్వులు పూయించనున్నట్టు సమాచారం. ఇండస్ట్రీ హిట్ శ్రీమంతుడు కాంబినేషన్లో వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus