మహేష్ బాబుతో పోటీకొచ్చిన ప్రభాస్

  • October 17, 2018 / 07:24 AM IST

సినిమారంగంలో స్టార్స్ గా ఎదిగిన వారు.. వ్యాపారంలోను అడుగుపెడుతున్నారు. కొంతమంది సినిమాకి సంబంధంలేని రంగంలో దూసుకుపోతుంటే.. మరికొంతమంది సినీ అనుబంధ వ్యాపారంలో విజయం సాధిస్తున్నారు. రామ్ చరణ్, రానా, మహేష్ బాబు, నాని .. తదితరులు సినిమా నిర్మాణంలో భాగం పంచుకుంటున్నారు. ఇక సూపర్ స్టార్ మహేష్ బాబు అయితే … మల్టీ ఫ్లెక్స్ వ్యాపారంలోనూ అడుగు పెట్టారు. ఏషియ‌న్ సినిమాస్ అధినేత సునీల్ నారంగ్ తో క‌లిసి మహేష్ రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 25 మ‌ల్టీప్లెక్స్ లు నిర్మించాల‌ని ప్లాన్ చేస్తున్నారు. ముందుగా హైదరాబాద్ లోని గచ్చిబౌలి ఏరియాలో ఏ ఎమ్ బి సినిమాస్ పేరుతో మల్టీ ఫ్లెక్స్ థియేటర్ అందుబాటులోకి రానుంది. సాంకేతిక హంగులతో రూపుదిద్దుకుంటున్న ఈ థియేటర్లలో అత్యంత సౌకర్యవంతగా సినిమా చూసే అవకాశం కల్పించారు.

ఈ రంగంలో ప్రభాస్ అడుగుపెట్టినట్టు తెలిసింది. తన మిత్రులు నెలకొల్పిన యు.వి.క్రియేషన్స్‌తో కలసి ప్రభాస్ ప్రస్తుతం ఓ థియేటర్ చెయిన్ బిజినెస్‌ను ప్రారంభించారని సమాచారం. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని కొన్ని పాత థియేటర్లను తీసుకొని తీర్చిదిద్దబోతున్నారు. ఇప్పటికే నెల్లూరు జిల్లా సూళ్లూరుపేటలో ఓ భారీ మల్టీప్లెక్స్‌ను సిద్ధం చేస్తున్నట్టు తెలిసింది. ఈ మల్టీప్లెక్స్‌లో 106 అడుగుల భారీ స్క్రీన్ స్పెషల్ అట్రాక్షన్‌గా నిలవబోతున్నట్టు టాక్. ప్రపంచంలోనే మూడో అతిపెద్ద స్క్రీన్ అని సినీ వర్గాలు తెలిపాయి. మరి ఈ రంగంలో ప్రభాస్ ఎంతటి విజయం సాధిస్తారో చూడాలి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus