మహేష్ మూవీ అనుకున్న సమయానికి రాకపోవచ్చట

  • September 28, 2018 / 11:12 AM IST

సూపర్ స్టార్ మహేష్ బాబు భరత్ అనే నేను వంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత వంశీ దర్శకత్వంలో మహర్షి అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. డీజే బ్యూటీ పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్ర మొదటి షెడ్యూల్ డెహ్రాడూన్ లోని కాలేజ్ లో జరిగింది. అదే ఉత్సాహంతో రెండో షెడ్యూల్ కూడా పూర్తి చేసుకుంది. మూడో షెడ్యూల్ అమెరికాలో ప్లాన్ చేశారు. దాదాపు నెల రోజుల పాటు జరిగే ఈ షెడ్యూల్ ల్లో కీలక సన్నివేశాలు చిత్రీకరించనున్నారు. అక్టోబర్ మొదటి వారంలో ఈ షెడ్యూల్ మొదలు కానున్నట్లు చెప్పుకుంటున్నారు. అప్పుడు కూడా వెళ్లడం లేదని తాజా సమాచారం. ఎందుకంటే రెండు షెడ్యూల్ రష్ చూసుకుంటే మహేష్ బాబు కి నచ్చలేదంట. చిత్ర బృందం కూడా సంతృప్తి పడలేదని తెలిసింది. అందుకే ఆ సన్నీ వేషాలని రీ షూట్ చేయాలనీ అనుకుంటున్నారు.

మహేష్ 25 వ సినిమా అంటే అన్ని విధాలా మెరుగ్గా ఉండాలి. అందుకే నిర్మాతలు దిల్ రాజు, అశ్వినీదత్, పీవీపీలు మరింత బడ్జెట్ కేటాయించడానికి సై అన్నారు. త్వరలోనే ఆ షెడ్యూల్ ప్లాన్ చేయనున్నారు. సంతృప్తికరంగా షూటింగ్ పూర్తి చేసిన తర్వాత చిత్ర బృందం అమెరికా షెడ్యూల్ పై దృష్టి పెట్టనుంది. ఈ సినిమా ఉగాది కానుకగా ఏప్రిల్ 5 న థియేటర్లోకి తీసుకురావాలని అనుకున్నారు. అధికారికంగా ప్రకటించారు కూడా. రీషూట్ కారణంగా ప్రకటించిన తేదీన రాదని తెలిసిపోయింది. మే నెల మహేష్ కి కలిసి రాలేదు. అందుకే జూన్ లోనే సినిమా థియేటర్లోకి వస్తుందని చెప్పుకుంటున్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus