మహేష్.. ఫ్యాన్స్ కు డబుల్ ట్రీట్.!!

  • January 19, 2019 / 09:38 AM IST

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం తన 25వ సినిమా అయిన ‘మహర్షి’ చిత్రంతో బిజీగా ఉన్నాడు. వంశీ పైడిపల్లి డైరెక్షన్లో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని దిల్ రాజు,అశ్వినీ దత్, ప్రసాద్ వి పొట్లూరి కలిసి నిర్మిస్తున్నారు. పూజా హెగ్దే హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంలో అల్లరి నరేష్ ముఖ్య పాత్ర పోషిస్తున్నాడు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతమందిస్తున్న ఈ చిత్రం సమ్మర్ కానుకగా ప్రేక్షకుల ముందుకి రానుంది.

అయితే మొదట ఈ చిత్రాన్ని ఏప్రిల్ 5న విడుదలచేయాలని భావించినప్పటికీ… కొంత షూటింగ్ పార్ట్ బ్యాలన్స్ ఉండడంతో… రిలీజ్ డేట్ మార్చబోతున్నట్టు టాక్ వినిపిస్తోంది. ‘ఆధునిక పద్ధతిలో చేస్తే వ్యవసాయం దండగ కాదు.. పండగ’ అనే కథాంశంతో ఈ చిత్రం తెరక్కుతుందని తెలుస్తుంది. మహేష్ బాబు 25 వ చిత్రం కావడంతో ‘మహర్షి’ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో చాలా ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్నారట. ఇక ఈ చిత్ర టీజర్ ను మహాశివరాత్రి కానుకగా మార్చి 4న విడుదలచేయడానికి చిత్ర యూనిట్ ఆలోచనలో ఉందట. ఇక అదే రోజున మహేష్ బాబు కొత్త చిత్రానికి సంబందించిన వివరాలు.. అలాగే ‘మహర్షి’ రిలీజ్ డేట్ ను కూడా అధికారికంగా ప్రకటించబోతున్నట్టు ఫిలింనగర్ విశ్లేషకుల సమాచారం.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus