‘మహర్షి’ పొల్లాచి షెడ్యూల్ పూర్తి..!

  • January 28, 2019 / 01:23 PM IST

మహేష్ బాబు 25 వ చిత్రంగా తెరకెక్కబోతున్న ‘మహర్షి’ చిత్రం పైనే ఇప్పుడు అందరి దృష్టి ఉంది. వంశీ పైడిపల్లి డైరెక్షన్లో .. దిల్ రాజు, అశ్వినీదత్ , ప్రసాద్ వి పొట్లూరి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మహేష్‌ సరసన పూజా హెగ్దే హీరోయిన్ గా నటిస్తోంది. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో అల్లరి నరేష్ ఓ ప్రత్యేక పాత్ర పోషితున్నాడు. సమ్మర్ కానుకగా ఈ చిత్రం ఏప్రిల్ 25 న విడుదల కాబోతుందని దిల్ రాజు ఇప్పటికే ప్రకటిచాడు.

ఇక ఈ చిత్ర షూటింగ్లో భాగంగా.. పొల్లాచ్చిలో జరుగుతున్న షెడ్యూల్ ను గత కొద్ది రోజులుగా చిత్రీకరిస్తున్నారు. ఈ రోజుతో ఈ షెడ్యూల్ పూర్తి కాబోతుందట. ఫిబ్రవరి నుండీ మరో షెడ్యూల్ మొదలు కాబోతుందని తెలుస్తుంది. ఇక ఈ షెడ్యూల్ తో దాదాపు షూటింగ్ పూర్తవుతుంది. ‘ఆధునిక పద్దతిలో వ్యవసాయం చేస్తే అది దండగ కాదు పండగ’ అనే కథాంశంతో ఈ చిత్రం తెరకెక్కబోతున్నట్టు తెలుస్తుంది. ఈ చిత్రం కచ్చితంగా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందని ఫిలింనగర్ విశ్లేషకులు చెప్పుకొస్తున్నారు. మహేష్ బాబు ‘పోకిరి’ ‘భరత్ అనే నేను’ చిత్రాలు ఏప్రిల్ నెలలోనే విడుదలయ్యి బ్లాక్ బస్టర్ హిట్టయ్యాయి. అదే సెంటిమెంట్ తో ‘మహర్షి’ చిత్రం కూడా బ్లాక్ బస్టర్ అవ్వడం ఖాయమని మహేష్ అభిమానులు ఆశిస్తున్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus