మహేష్ -సుకుమార్ చిత్రంలో హీరోయిన్ గా కత్రినా?

  • January 4, 2019 / 08:11 AM IST

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం తన 25వ సినిమా అయిన ‘మహర్షి’ షూటింగ్లో బిజీగా ఉన్నాడు. దిల్ రాజు, అశ్వినీ దత్, పీ.వీ.పీ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని వంశీ పైడిపల్లి డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ చిత్రంలో పూజా హెగ్దే హీరోయిన్ గా నటిస్తుండగా.. అల్లరి నరేష్ కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఇప్పటికే చాలా వరకూ చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఉగాది కానుకగా ఏప్రిల్ 5న విడుదల కాబోతుంది. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం పై భారీ అంచనాలున్నాయి.

ఇక ‘మహర్షి’ పూర్తయ్యాక మహేష్ తన 26వ సినిమాని సుకుమార్ డైరెక్షన్లో చేయబోతున్నాడు. దాదాపు స్క్రిప్ట్ పనులు పూర్తయ్యాయట. మైత్రి మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మించనుంది. ఇక ఈ చిత్రంలో హీరోయిన్ ఎవరనేదాని పై ఫిలింనగర్లో ఓ ఆసక్తికరమైన విషయమొకటి చక్కర్లు కొడుతుంది. ఈ క్రేజ్ ప్రాజెక్ట్ లో బాలీవుడ్ నటి కత్రినా కైఫ్ ను హీరోయిన్ గా తీసుకోవాలనే ఆలోచనలో చిత్రయూనిట్ ఉందట. గతంలో వెంకటేష్ తో ‘మల్లీశ్వరి’ అలాగే బాలకృష్ణతో ‘అల్లరి పిడుగు’ చిత్రాలలో హీరోయిన్ గా నటించింది కత్రినా. ఇప్పుడు మహేష్ తో చేయబోయే మూవీ కోసం మళ్ళీ కత్రీనాని టాలీవుడ్ కు తీసుకొచ్చే ఆలోచనలో సుకుమార్ ఉన్నట్టు తెలుస్తుంది. త్వరలోనే కత్రినాను కలిసి కథ వినిపించే ప్రయత్నాల్లో సుకుమార్ ఉన్నాడట. టాలీవుడ్ లో మహేష్ తో కలిసి నటించాలని కోరుకుంటున్నట్టు గతంలో బాలీవుడ్ భామలు చాలా మంది పలు సందర్భాల్లో చెప్పుకొచ్చారు. మరి కత్రినా కైఫ్ ఏమంటుందో.. చూడాలి..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus