‘మహర్షి’ వాయిదా పడటంతో పండగ చేసుకుంటున్న యువ హీరోలు..!

మహేష్ బాబు ప్రస్తుతం ‘మహర్షి’ చిత్రంతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. వంశీ పైడిపల్లి డైరెక్షన్లో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని నిర్మాత దిల్ రాజు 2019 సమ్మర్ కానుకగా విడుదల కానుందని ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా విడుదల వాయిదా పడబోతుందని తెలుస్తుంది. ఇప్పటికే యువ హీరోలయిన నాని, నాగచైతన్య, సాయి ధరమ్ తేజ్ ల చిత్రాలు ఏప్రిల్ లో విడుదల చేయడానికి ప్లాన్ చేసుకుంటున్నారు. నాని ‘జెర్సీ’ ఏప్రిల్ 19 న విడుదల కాబోతుండగా… నాగచైతన్య, సమంత ల ‘మజిలీ’ సినిమా ఏప్రిల్ 5న విడుదల కాబోతుంది. ఇక సాయి ధరమ్ తేజ్ నటించిన ‘చిత్రాలహరి’ ఏప్రిల్ రెండు లేదా మూడో వారంలోనే విడుదల కాబోతుందని సమాచారం.

మహేష్ కన్నా మార్కెట్ తక్కువ ఉన్న ఈ హీరోలు మహేష్ బాబు చిత్రానికి పోటీగా ఏప్రిల్లోనే విడుదల చేయాలి అనుకోవడానికి కారణం మహేష్ సినిమా వాయిదా పడటమే అని ఫిలింనగర్ విశ్లేషకులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అందులోనూ ‘మహర్షి’ దర్శకుడు వంశీ పైడిపల్లి సినిమాను పూర్తి చేయడానికి చాలా టైం తీసుకుంటాడనే సంగతి తెలిసిందే. పైగా ఇది మహేష్ 25 వ చిత్రం కావడంతో మరింత జాగ్రత్త తీసుకుంటున్నాడట. ఇక ఈ చిత్రం ఏప్రిల్ 26న లేదా మే మొదటి వారంలో విడుదల చేయడానికి చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది. మరి ఈ వార్తల్లో నిజమెంతో తెలియాల్సి ఉంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus