మంచు ఫ్యామిలీ ఈ మధ్య సినిమాలతో కంటే వివాదాలతోనే ఎక్కువగా వార్తల్లో నిలుస్తుంది. మనోజ్ ఇష్యూ ఒకపక్క, విధ్యాసంస్థల ఇష్యూ మరోపక్క ఇలా చాలా సమస్యలతో మంచు ఫ్యామిలీ సతమతమవుతుంది అని చెప్పాలి. అయితే ఎవ్వరూ ఊహించని విధంగా మోహన్ బాబు మాత్రం ఇటీవల 2 సినిమాలకి సైన్ చేసి.. వాటితో బిజీ అయ్యారు. మనోజ్ ఎలాగూ సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించి ‘భైరవం’ ‘మిరాయ్’ వంటి సినిమాలతో విలన్ గా ఎస్టాబ్లిష్ అయ్యే ప్రయత్నాలు చేస్తున్నాడు. అలాగే హీరోగా కూడా సినిమాలు ఒప్పుకుంటున్నాడు.
ఎటొచ్చీ మంచు విష్ణు(Manchu Vishnu) కెరీర్ అయోమయంగా మారింది.మంచు విష్ణు ఈ మధ్య కాలంలో సినిమాలు బాగా తగ్గించేశాడు. కెరీర్ ప్రారంభం నుండి బయట బ్యానర్లలో సినిమాలు చేయడం తక్కువే. పైగా విష్ణుని హీరోగా పెట్టి సినిమా తీయడానికి బయట నిర్మాతలు ఇంట్రెస్ట్ కూడా చూపించరు. ఇక విష్ణు హీరోగా తప్ప వేరే రోల్స్ కి ఓకే చెప్పడు. అవసరమైతే తానే నిర్మాతగా మారి సినిమాలు చేస్తూ ఉంటాడు.
‘మోసగాళ్ళు’ ‘జిన్నా’ ‘కన్నప్ప’ వంటి సినిమాల్లో మంచు విష్ణు హీరోగా నటించడంతో పాటు వాటికి నిర్మాతగా కూడా వ్యవహరించాడు.’కన్నప్ప’ సినిమాకి అప్రిసియేషన్ బాగానే వచ్చింది కానీ.. కమర్షియల్ గా అది బాక్సాఫీస్ వద్ద నిలబడలేదు. ఒటీటీలో కూడా ట్రెండింగ్ కి వెళ్లింది లేదు. ప్రభాస్ వంటి పాన్ ఇండియా స్టార్ రంగంలోకి దిగినా.. ‘కన్నప్ప’ కమర్షియల్ గా సేఫ్ అయ్యింది లేదు.
ఇక ప్రస్తుతం విష్ణు.. ప్రభుదేవా దర్శకత్వంలో సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు. ఇదొక ఎంటెర్టైనర్ మూవీ అని తెలుస్తుంది. విష్ణుకి అలాంటి కథలు కలిసొచ్చాయి. అందుకే ఈ ప్రాజెక్టు కోసం స్పెషల్ గా ట్రైనర్ ని పెట్టుకుని మరీ కసరత్తులు చేస్తున్నాడు. వచ్చే నెలలో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్ళే అవకాశం ఉంది.