మనీషా కొయిరాలా తల్లిగా రీ ఎంట్రీ

  • June 30, 2016 / 01:25 PM IST

తెరపైన నెల్లూరి నెరజానగా కుర్రకారు హృదయాల్లో నిలిచి పోయిన భామ మనీషా కొయిరాలా. ఒకే ఒక్కడు చిత్రం ద్వారా తెలుగు సినీ ప్రేక్షకులకు ఈ సుందరి బాగా దగ్గరయ్యింది. అంతకు ముందు భారతీయుడు, ముంబై సినిమాల్లో అందం అభినయం కలిగిన నటిగా పేరుతెచ్చుకుంది. బాలీవుడ్ లో పదేళ్ల పాటు అగ్ర కథానాయికల్లో ఒకరిగా మనీషా కొనసాగింది.

2010 లో పెళ్లి చేసుకున్న ఈ నటి.. రెండేళ్లకే భర్త నుంచి విడిపోయింది. ఆమెకు  గర్భాశయ ముఖ ద్వారం ఉందని బయట పడడంతో సినిమాలకు దూరమై చికిత్స తీసుకుంది. పూర్తి ఆరోగ్యవంతురాలై సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇస్తోంది. ఇరవై ఏళ్ల కుర్రోడికి తల్లిగా నటిస్తోంది. చిన్నప్పుడే విడిపోయిన తల్లి కొడుకులు ఇరవై ఏళ్ల తర్వాత కలుసుకునే కథతో హిందీ, బెంగాలీ భాషలో తెరకెక్కనున్నఈ సినిమా సెప్టెంబర్ నుంచి సెట్స్ మీదకు వెళ్లనుంది. ఇందులో మనీషా బుర్కా ధరించి ఉర్దూ, బెంగాలీ భాషలు కలిపి మాట్లాడే అమ్మగా కనిపించనుంది. కోల్ కత్తా పరిసరాల్లో సినిమా మొత్తం చిత్రీకరణ జరుపుకోనుంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus