మనసులోని కోరికని బయట పెట్టిన మనీషా కొయిరాలా

  • June 22, 2018 / 02:36 PM IST

నటి సిల్క్ స్మిత బయోపిక్ ని కమర్షియల్ యాంగిల్ ల్లో డర్టీ పిక్చర్ అంటూ తీసి సూపర్ హిట్ అందుకున్నారు. ఆ తర్వాత క్రికెటర్ ధోనీపై తీసిన బయోపిక్ కూడా మంచి విజయం సాధించింది. బాలీవుడ్ లో మొదలయిన బయోపిక్ జోరు దక్షిణాది సినీ పరిశ్రమకి పాకింది. ఇక్కడ రీసెంట్ గా రిలీజ్ అయిన అభినేత్రి సావిత్రి బయోపిక్ మూవీ మహానటి సంచలన సృష్టించింది. కాసుల వర్షం కురిపించింది. దీంతో దర్శక నిర్మాతలు బయోపిక్ ల మీద పడ్డారు. బాలకృష్ణ తన తండ్రి ఎన్టీఆర్ బయోపిక్ తీసే పనిని ఎప్పుడో మొదలెట్టేసాడు. ఇక తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి, నటి జయలలిత బయోపిక్ కోసం తమిళంలో స్క్రిప్ట్ పనులు జరుగుతున్నాయి. అలాగే బాలీవుడ్ లో శ్రీదేవి బయోపిక్ కోసం చర్చలు సాగుతున్నాయి. ఇంకా నటి సౌందర్య.. బయోపిక్ కూడా వినిపిస్తోంది. అందుకే అటువంటి అరుదైన అవకాశాన్ని వదులుకోకూడదని హీరోయిన్స్ ముందుగానే తమకి నచ్చిన వ్యక్తుల పేర్లు మీడియాతో షేర్ చేసుకుంటున్నారు.

ఆయా బయోపిక్ ల కోసం తమని పరిశీలించాలని డైరక్ట్ గా చెప్పేస్తున్నారు. కొన్ని రోజుల క్రితం తమన్నా మీడియాతో మాట్లాడుతూ.. తనకు టెన్నిస్ ప్లేయర్ సానియా మీర్జా, అతిలోకసుందరి శ్రీదేవి బయోపిక్ లలో నటించాలని ఆశగా ఉన్నట్లు చెప్పింది. తాజాగా మనీషా కొయిరాలా తన మనసులోని కోరికను బయట పెట్టింది. తనకి ఇందిరాగాంధీ పాత్రలో నటించాలని ఉందని వెల్లడించింది. “అత్యంత శక్తిమంతమైన మహిళగా ఇందిరాగాంధీ కనిపిస్తారు. ఆమె పరిపాలనా కాలంలో తీసుకున్న సాహసోపేతమైన నిర్ణయాలు .. దేశ ప్రజలను ఆమె ప్రభావితం చేసిన తీరు అపూర్వం. అలాంటి అసాధారణమైన మహిళగా .. ఆదర్శవంతమైన ప్రధానిగా వెండితెరపై కనిపించాలనేది నా చిరకాల కోరిక.” అని చెప్పింది. మరి వీళ్ళ ఆశలు ఎంతమేరకు తీరుతాయో చూడాలి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus