మను కోసం ఎదురుచూస్తున్న ఓవర్సీస్ సినీ ప్రేమికులు!

  • August 28, 2018 / 12:09 PM IST

మధురం అనే షార్ట్ ఫిలిం తో నెటిజనులు ఆకట్టుకున్న ఫణీంద్ర నర్సెట్టి తొలిసారి చేసిన సినిమా మను. క్రౌడ్ ఫండింగ్ తో తెరకెక్కిన ఈ చిత్రంలో బ్రహ్మానందం తనయుడు గౌతమ్‌ హీరోగా నటించారు. పల్లకిలో పెళ్లి కూతురు’ చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన గౌతమ్‌,  ‘బసంతి’తో  మంచి పేరు తెచ్చుకున్నారు. ఇప్పుడు ‘మను’ చిత్రంలో విభిన్నమైన పాత్రలో కనిపించబోతున్నారు. హీరోయిన్ గా చాందిని చౌదరి నటించిన ఈ మూవీ ట్రైలర్ కి విశేష స్పందన వచ్చింది. అమెరికాలో ప్రముఖ డిస్ట్రిబ్యూషన్ సంస్థ నిర్వాణ సినిమాస్ వారు సమర్పిస్తున్న ఈ చిత్రం వచ్చే నెల 7 న థియేటర్లోకి రానుంది. తెలుగు రాష్ట్రాల్లోని సినీ ప్రేమికులు ఈ చిత్రంపై ఆసక్తి కనబరచడం కామన్.

కానీ ఓవర్సీస్ లోను ఈ సినిమా కోసం ఎదురుచూసేవారు రోజురోజుకి పెరుగుతున్నారు. న్యూ సౌత్ వేల్స్, జర్మనీ, లక్సమ్ బర్గ్, నార్త్ కరోలినా, విర్జిన్ తదితర ప్రాంతాల వారు మను సినిమాపై ఉన్న ప్రేమను విభిన్నంగా తెలుపుతున్నారు. కొంతమంది అక్షరాల రూపంలో.. మరికొంతమంది బొమ్మలు వేసి మరి చాటుతున్నారు. వీరి ఉత్సాహం చూసిన ట్రేడ్ వర్గాలవారు ప్రీమియర్ షోలకు మంచి కలక్షన్స్ వచ్చే అవకాశముందని భావిస్తున్నారు. 115 మందికి నచ్చి నిర్మించిన ఈ మూవీ ఎంతమంది మనసులు దోచుకుంటుందో చూడాలి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus