మనసును మెలిపెడుతుంది, మెదడుకి పని చెబుతుంది!

  • August 12, 2018 / 12:12 PM IST

ఒక సినిమా మీద ప్రేక్షకులకు ఒక అవగాహన రావడం కోసం సినిమా ఏ జోనర్ అనేది తెలియజెప్పడం కోసం ఫిలిం మేకర్స్ ట్రైలర్ ను విడుదల చేస్తారు. కొన్ని ట్రైలర్స్ ఆకట్టుకోగా.. కొన్ని నిరాశపరుస్తాయి. కొన్ని మాత్రం ఆర్జెంట్ గా టికెట్స్ బుక్ చేసుకోవాలి అనిపించేంతగా. ఈ మూడో కోవకి చెందిన చిత్రమే “మను”. “మధురం” అనే షార్ట్ ఫిలింతో నెటిజన్లను విశేషంగా ఆకట్టుకున్న ఫణీంద్ర నార్సెట్టి ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం కానున్నాడు. క్రౌడ్ ప్రొడ్యూస్ చేస్తున్న ఈ చిత్రం ట్రైలర్ ను ఇవాళ విడుదల చేశారు. థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం ట్రైలర్ ఇవాళ విడుదలై ప్రేక్షకుల్ని స్పెల్ బౌండ్ చేస్తుంది.

గౌతమ్ రాజ్, చాందిని చౌదరి ప్రధాన పాత్రల్లో రూపొందిన ఈ చిత్రం ట్రైలర్ ను జాగ్రత్తగా గమనిస్తే.. ఈ సినిమా కేవలం కోటి రూపాయల్లో తెరకెక్కింది అంటే నమ్మడం కష్టమే. ముఖ్యంగా సౌండ్ డిజైనింగ్ & కెమెరా వర్క్ భారీ బడ్జెట్ సినిమాలకు ఏమాత్రం తీసిపోని విధంగా ఉండడం విశేషం.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus