టాలీవుడ్లో తన అందం, అభినయంతో తక్కువ కాలంలోనే ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ మీనాక్షి చౌదరి. ఇప్పుడు మరో కీలక అడుగు వేయబోతున్నట్టు సమాచారం. వరుసగా అవకాశాలు అందుకుంటూ కెరీర్ను ముందుకు దూసుకుపోతున్న మీనాక్షి, తాజాగా బాలీవుడ్ వైపు అడుగులు వేయనున్నారన్న వార్తలు ఫిల్మ్ సర్కిల్స్లో హాట్ టాపిక్గా మారాయి.
తెలుగులో హిట్ 2, లక్కీ భాస్కర్, సంక్రాంతికి వస్తున్నాం వంటి సినిమాలతో మంచి పేరు సంపాదించిన ఈ భామ, ఇటీవల నవీన్ పోలిశెట్టి నటించిన కామెడీ ఎంటర్టైనర్ ‘అనగనగా ఒక రాజు’ చిత్రంతో ప్రేక్షకులను అలరించింది. ఆ సినిమా సక్సెస్తో మీనాక్షి క్రేజ్ మరింత పెరిగింది. ఇదే సమయంలో, బాలీవుడ్ నుంచి వచ్చిన ఆఫర్ ఆమె కెరీర్లో మరో టర్నింగ్ పాయింట్గా మారనుందని సినీ విశ్లేషకులు అంటున్నారు.
తాజా సమాచారం ప్రకారం, మీనాక్షి బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ సరసన నటించే అవకాశం దక్కించుకుంది. ఆయన నటిస్తున్న భాగమ్ భాగ్ 2 సినిమాలో హీరోయిన్గా ఆమె పేరు ఫైనల్ అయినట్టు తెలుస్తోంది. ఈ చిత్రానికి దర్శకుడు రాజ్ శాండిల్య దర్శకత్వం వహిస్తున్నారు. గతంలో వచ్చిన భాగమ్ భాగ్ సూపర్ హిట్ కావడంతో, ఈ సీక్వెల్పై భారీ అంచనాలు ఉన్నాయి.
ఈ సినిమాలో మీనాక్షితో పాటు మనోజ్ బాజ్పాయ్ వంటి ప్రముఖులు కీలక పాత్రల్లో కనిపించనున్నారని టాక్. ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ పనులు చివరి దశకు చేరుకున్నాయని, త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుందని సమాచారం. అన్ని కార్యక్రమాలు పూర్తిచేసి, 2026 చివరినాటికి థియేటర్లలో విడుదల చేయాలనే ప్లాన్లో యూనిట్ ఉన్నట్టు తెలుస్తోంది.
తెలుగు, తమిళ్ ప్రేక్షకుల్ని ఇప్పటికే ఆకట్టుకున్న మీనాక్షి, బాలీవుడ్లో కూడా అదే స్థాయిలో మెప్పిస్తుందా అన్నది ఆసక్తికరంగా మారింది. ఇటీవలి కాలంలో పలువురు టాలీవుడ్ హీరోయిన్లు హిందీ చిత్రసీమలో ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ, స్థిరమైన విజయాలు మాత్రం కొందరికే దక్కాయి. మరి మీనాక్షి ఈ ఛాన్స్ను ఎంతవరకు ఉపయోగించుకుంటుందో చూడాలి.