మెగా బ్రదర్స్… అక్కడ ఏం చేస్తున్నారు..?

  • March 23, 2019 / 12:50 PM IST

మెగా బ్రదర్స్… అక్కడ ఏం చేస్తున్నారు..? ఒక పక్క పవన్ కళ్యాణ్ నాగేంద్ర బాబు ఎన్నికల హడావిడిలో బిజీగా ఉన్నారు. ఇక మిగిలిన మెగా హీరోలందరూ ఎవరి సినిమాలతో వారు బిజీగా గడుపుతున్నారు. ఇక మెగా డాటర్ నిహారిక కూడా ‘సూర్యకాంతం’ చిత్ర ప్రమోషన్లలో బిజీగా ఉంది. అయితే మరీ పని ఎక్కువైందని అనుకున్నారో ఏమో… మెగా బ్రదర్స్ ఇద్దరూ ఓ మంచి ట్రిప్ వేశారు. ఇంతకీ ఎవరు ఆ మెగా బ్రదర్స్ అనుకుంటున్నారా. ఇంకెవరండీ… మన మెగాపవర్ స్టార్ రాంచరణ్ , మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్..! వీరిద్దరూ కలిసి ఓ చిన్న ట్రిప్ కి వెళ్ళారంట.

తాజాగా వీరిద్దరూ తీసుకున్న సెల్ఫీ ఇప్పుడు మెగా అభిమానులను తెగ ఆకర్షిస్తోంది. ఈ సెల్ఫీలో ఈ మెగాబ్రదర్స్ డిఫరెంట్ లుక్స్ తో కనిపిస్తుండడం విశేషం. కొలంబియాలోని కలి సిటీకి ఇద్దరూ సరదాగా ఓ ట్రిప్ వేశారంటే. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ‘ఎఫ్2’ తో భారీ విజయాన్నందుకున్న వరుణ్ తేజ్ ఇప్పుడు హరీష్ శంకర్ తో ‘వాల్మీకి’ అనే చిత్రంలో నటిస్తున్నాడు. ఇక ‘మిస్టర్ సి'(రాంచరణ్) తారక్ తో కలిసి రాజమౌళి డైరెక్షన్లో ‘ఆర్.ఆర్.ఆర్’ వంటి భారీ మల్టీ స్టారర్ చిత్రంలో నటిస్తున్నాడు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus