సుష్మిత బర్త్ డే వేడుకలో గట్టి నిర్ణయం తీసుకున్న మెగా హీరోలు

  • March 13, 2018 / 07:18 AM IST

మెగాస్టార్ చిరంజీవి పెద్ద కుమార్తె సుష్మిత పుట్టినరోజు వేడుక రెండు రోజుల క్రితం వైభవంగా జరిగింది. ఈ వేడుకకు పవన్ కళ్యాణ్ మినహా మెగా హీరోలందరూ హాజరయ్యారు. అంతేకాదు శ్రీజ, నిహారికతో పాటు క్లోజ్ ఫ్రెండ్స్ కూడా పాల్గొని సందడి చేశారు. ముఖ్యంగా సాయిధరమ్ తేజ్, వరుణ్ తేజ్, అల్లు అర్జున్ డ్యాన్సులతో అదరగొట్టారని సమాచారం. ఈ శుభసందర్భాన మెగా హీరోలు మంచి నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది. అది ఏమిటంటే.. మెగా హీరోల్లో అల్లు శిరీష్, సాయి ధరమ్ తేజ్ లు కొంతకాలంగా హిట్ లేక బాధపడుతున్నారు. వారికి విజయాన్ని ఇవ్వాలని ఇతర హీరోలు ఫిక్స్ అయ్యారు.

ఎవరి దగ్గరికైనా కథ వచ్చిందంటే ఆ కథని ఇతర హీరోలందరూ వినాలి.. అప్పుడు అందులోని లోపాలు, డవుట్స్ గురించి చర్చించాలి.. అన్ని విధాలా ఆ కథ బాగుంటేనే ఒకే చెప్పాలని డిసైడ్ అయ్యారు. ఇలా చేయడం వల్ల మంచి కథలు దొరుకుతాయని నమ్ముతున్నారు. అంతేకాదు చిరంజీవి, పవన్ కళ్యాణ్, బన్నీ కి వచ్చిన కథ బాగున్నా.. వారి ఇమేజ్ కి సరిపోకపోతే ఆ కథని మెగా హీరోకి ఫార్వార్డ్ చేయాలి.. తప్ప మెగా కాంపాండ్ దాటి వెళ్లకూడదని నిర్ణయం తీసుకున్నారు. మరి ఈ ఆలోచన ఎన్ని హిట్స్ తెచ్చి పెడుతాయో చూడాలి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus