ఎన్నికల రోజున తలబడనున్న మూడు చిత్రాలు!

  • December 5, 2018 / 07:56 AM IST

డిసెంబర్ 7 న ఒక పక్క తెలంగాణ ముందస్తు ఎన్నికలు జరుగుతుండడం ఒక విశేషమైతే అదే రోజున బాక్స్ ఆఫీస్ దగ్గర 3 చిత్రాలు బాక్సాఫీస్ దగ్గర పోటీ పడటం మరో విశేషం. ఇంకా ‘2.0’ హడావిడి థియేటర్ల దగ్గర తగ్గక ముందే మరో మూడు చిత్రాలతో బాక్సాఫీస్ కనువిందు చేయనుంది. బెల్లంకొండ శ్రీనివాస్ ‘కవచం’, సుమంత్ ‘సుబ్రహ్మణ్యపురం’, సందీప్ కిషన్ ‘నెక్స్ట్ ఏంటి?’ చిత్రాలు ఈ చిత్రాలు ఈ శుక్రవారమే ప్రేక్షకుల ముందుకు రానున్నాయి.

ఇప్పటి వరకు ఒక్క హిట్టు కూడా లేనప్పటికీ, పెద్ద దర్శకులతో పనిచేసి తనకంటూ ఒక మార్కెట్ ను ఏర్పరుచుకున్న బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కు ఇది అసలైన పరీక్ష. ‘కవచం’ టీజర్, ట్రైలర్ బాగానే ఉన్నాయి. ఈ చిత్రంలో బెల్లంకొండ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కనిపిస్తున్నాడు. కాజల్ అగర్వాల్-మెహ్రీన్ ల గ్లామర్ స్పెషల్ అట్రాక్షన్ కాగా ప్రభాస్ ‘సాహో’ విలన్ నీల్ నితీష్ విలన్ గా నటించడం వంటివి చెప్పుకోదగ్గ అంశాలు.

2017 లో ‘మళ్ళీ రావా’ చిత్రంతో డీసెంట్ హిట్ సాధించిన సుమంత్ ఈసారి ‘సుబ్రమణ్యపురం’ చిత్రంతో వస్తున్నాడు. ఇది సుమంత్ కు 25 వ చిత్రం కావడం విశేషం. ఈషా-రెబ్బా హీరోయిన్ గా నటిస్తుంది. డిసెంబర్ నెలలో వచ్చిన ‘సత్యం’ ‘మళ్ళీ రావా’ చిత్రాలు సుమంత్ కు హిట్స్ ఇచ్చాయి. మరి ‘సుబ్రహ్మణ్యపురం’ కూడా హిట్టొస్తుందేమో చూడాలి.

ఇక మరో చిత్రం సందీప్ కిషన్ – తమన్నాల ‘నెక్స్ట్ ఏంటి?’. బాలీవుడ్ లో ‘ఫనా’ లాంటి విజయవంతమైన సినిమా తీసిన కునాల్ కోహ్లీ దర్శకత్వం వహించిన ఈ చిత్రం టీజర్,ట్రైలర్ యూత్ ను ఆకట్టుకున్నాయి. రొమాంటిక్ కంటెంట్ ఎక్కువగా ఉన్న ఈ చిత్రం పై కూడా మంచి అంచనాలే ఉన్నాయి. మరి ఈ మూడు చిత్రాలలో ప్రేక్షకులు ఏ చిత్రానికి ఓటు వేస్తారో చూడాలి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus