రిపబ్లిక్ డే కానుకగా అఖిల్ చిత్రం!

  • December 13, 2018 / 09:18 AM IST

అక్కినేని నాగార్జున తనయుడిగా టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చినప్పటికీ.. అఖిల్ ఇప్పటి వరకు సరైన హిట్ సాధించలేదనే చెప్పాలి. మాస్ చిత్రాలకు కేర్ అఫ్ అడ్రస్ అయిన వి.వి.వినాయక్ డైరెక్షన్లో చేసిన మొదటి చిత్రం ‘అఖిల్’ ఘోరమైన డిజాస్టరైన సంగతి తెలిసిందే. అయితే డ్యాన్సులకు, ఫైట్ల కు మాత్రం అఖిల్ కు మంచి మార్కులే పడ్డాయి. అక్కినేని ఫ్యామిలీలో అఖిల్ ను మాస్ హీరోగా నిలబెట్టాలని నాగ్ చేయని ప్రయత్నం అంటూ లేదు. ఇక అయిందేదో అయ్యిందిలే అనుకుని ‘మనం’ లాంటి ఎవర్ గ్రీన్ క్లాసిక్ ఇచ్చిన విక్రమ్ కుమార్ చేతిలో అఖిల్ ను పెట్టాడు నాగ్. అఖిల్ రెండవ సినిమాగా వచ్చిన ‘హలో’ చిత్రం మంచి రివ్యూలను దక్కించుకున్నప్పటికీ సరైన కలెక్షన్లను రాబట్టలేక పోయింది.

ఇక అక్కినేని ఫ్యామిలీ కి తిరుగులేని క్లాస్ ఇమేజ్ ఉందని చెప్పడంలో సందేహం లేదు. లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటెర్టైనెర్స్ చేసిన ప్రతీసారి హిట్లు మిస్సవ్వలేదు. ఈ సారి ఆ కోవనే ఎంచుకున్నాడు అఖిల్. వరుణ్ తేజ్ తో ‘తొలిప్రేమ’ లాంటి సిన్సియర్ లవ్ స్టోరీ తో హిట్టిచ్చిన వెంకీ అట్లూరి డైరెక్షన్లో ‘మిస్టర్ మజ్ను’ చిత్రంతో తన మూడవ చిత్రం చేయడానికి రెడీ అయ్యాడు. ‘సవ్య సాచి’ ఫేమ్ నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రానికి తమన్ సంగీతమందిస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన టీజర్ కు డీసెంట్ టాక్ వచ్చింది. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్ పై బీఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని 2019 జనవరి 25 న విడుదల చేయబోతున్నట్టు ఖరారు చేసారు. మరి ఈ చిత్రంతో అయినా అఖిల్ హిట్టు కొడతాడేమో చూడాలి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus