మురుగదాస్ పోస్ట్ చేసిన కామెంట్ కి ఆశ్చర్యపోయిన మహేష్ అభిమానులు

  • January 3, 2017 / 10:09 AM IST

తమిళ దర్శకుడు ఏ ఆర్ మురుగదాస్ కొత్త సంవత్సరంలో ఇచ్చిన ట్విస్ట్ కి మహేష్ బాబు అభిమానులు షాక్ అయ్యారు. ప్రస్తుతం ప్రిన్స్ ఆయన దర్శకత్వంలో ద్విభాషా చిత్రం చేస్తున్నారు. వందకోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతున్న యాక్షన్ థ్రిల్లర్ మూవీలో సూపర్ స్టార్ ఇన్వెస్టగేట్ ఆఫీసర్ గా నటిస్తున్నారు. ఇప్పటికీ 80 శాతం కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా సంగతులు తెలుసుకోవాలని అభిమానులు ఆరాటపడుతున్నారు. కానీ మురుగదాస్ బృందం ఒక్క విషయం కూడా బయటికి రానివ్వడంలేదు. కనీసం పేరు కూడా అధికారికంగా ప్రకటించలేదు. అయితే న్యూ ఇయర్ సందర్భంగా ఫ్యాన్స్ కి మంచి వార్త అందింది. జనవరి ఫస్ట్ న మహేష్ బాబు మురుగదాస్ కి కొత్త సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.

అందుకు థాంక్స్ చెబుతూ.. “బ్లాక్ బస్టర్ ఆన్ ది వే” అని  పోస్ట్ చేయడం అభిమానుల్లో ఆనందాన్ని నింపింది. బ్రహ్మోత్సవం అపజయం తో నిరాశలో ఉన్న ఫ్యాన్స్ కి ఈ మాట ఊరటనిచ్చింది. ఫిట్ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంలో తమిళ డైరక్టర్, నటుడు ఎస్.జె.సూర్య విలన్ గా చేస్తున్నారు. జనవరి 7 నుంచి హైదరాబాద్ లో ప్రారంభం కానున్న కొత్త షెడ్యూల్ లో మహేష్, రకుల్ తదితరులు పాల్గొననున్నారు.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus