రిలీజ్ దగ్గరపడిన టైమ్ లో మ్యూజిక్ డైరెక్టర్ అవుట్

  • May 27, 2019 / 04:05 PM IST

ప్రస్తుతం తెలుగులో తెరకెక్కుతున్న మోస్ట్ క్రేజీయస్ట్ ప్రొజెక్ట్స్ లో “సాహో” ఒకటి. ప్రభాస్, శ్రద్ధాకపూర్, నీల్ నితిన్ ముఖేష్ ప్రధాన పాత్రల్లో రూపొందుతున్న ఈ చిత్రానికి సుజీత్ దర్శకుడు. సినిమాకి రీషూట్స్ జరుగుతున్నాయని, అందుకే రిలీజ్ లేట్ అవుతుందని వస్తున్న రూమర్స్ అన్నిటికీ “ఆగస్ట్ 15 విడుదల” అనే పోస్టర్ తో క్లారిటీ ఇచ్చాడు చిత్ర కథానాయకుడు ప్రభాస్. దాంతో ప్రభాస్ అభిమానులందరూ సినిమా రిలీజ్ లో లేట్ లేదని సంబరాలు మొదలెట్టగా.. వారి మీద పిడుగులాంటి వార్త వచ్చి పడింది.

అదేమిటంటే.. ఈ చిత్రానికి సంగీత దర్శకత్వం వహించాల్సిన సంగీత త్రయం శంకర్-ఎహసాన్-లాయ్ లు “సాహో” నుంచి సంగీత దర్శకులుగా తప్పించుకొన్నామని స్వయంగా ప్రకటించారు. దాంతో రిలీజ్ కి సరిగ్గా రెండున్నర నెలల ముందు ఇలా సంగీత దర్శకులు సినిమా నుంచి తప్పించుకోవడంతో ఇప్పుడు సినిమాకి బ్యాగ్రౌండ్ స్కోర్ ఎవరు అందిస్తారు? ఆగస్ట్ 15 కల్లా సినిమా రెడీ అవుతుందా అనే అనుమానం మొదలైంది. ఇప్పుడు శంకర్-ఎహసాన్-లాయ్ స్థానంలో తమన్ వస్తాడా లేక జీబ్రాన్ వస్తాడా అనే డిస్కషన్స్ కూడా మొదలయ్యాయి. ఎవరు వచ్చిన రిలీజ్ కి రెండున్నర నెలల ముందు వాళ్ళ చేతుల్లోకి సినిమా వెళ్ళడం అంటే కాస్త పెద్ద టెన్షన్ మెడకు చుట్టుకున్నట్లే. మరి ఎవరు ఈ రిస్క్ తీసుకుంటారో చూడాలి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus